24 గంటల్లో కేవలం 190 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,67,725కి చేరిన కేసుల సంఖ్య
తెలంగాణ (Telangana)లో కొత్తగా 190 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఇద్దరు (corona deaths in telangana) మరణించారు. 245 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,929 యాక్టివ్ కేసులు వున్నాయి.
తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 42,166 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 190 మందికి పాజిటివ్గా (corona cases) తేలింది. 245 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు వైరస్ వల్ల ప్రాణాలు (corona deaths in telangana) కోల్పోయారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,67,725కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,288 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 3,929కి పెరిగింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 3, జీహెచ్ఎంసీ 58, జగిత్యాల 3, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 22, ఖమ్మం 8, మహబూబ్నగర్ 2, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 2, మంచిర్యాల 3, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 11, ములుగు 1, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 8, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 1 , పెద్దపల్లి 2, సిరిసిల్ల 4, రంగారెడ్డి 13, సిద్దిపేట 6, సంగారెడ్డి 2, సూర్యాపేట 4, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 18, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.