Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: 24 గంటల్లో 172 మందికి కరోనా పాజిటివ్.. 6,73,312కి చేరిన కేసుల సంఖ్య

తెలంగాణ (Telangana)లో కొత్తగా 172 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) మరణించారు. 167 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,741 యాక్టివ్‌ కేసులు వున్నాయి

172 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Nov 12, 2021, 10:06 PM IST

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 39,804 మందికి పరీక్షలు నిర్వహించగా.. 172 కొత్త కొవిడ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,73,312కు చేరింది. 24 గంటల వ్యవధిలో ఒకరు వైరస్ కారణంగా ప్రాణాలు  (corona deaths in telangana) కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,972కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 167 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,741 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

కాగా..  Indiaలో గత 24 గంటల్లో  12,516 కొత్త Corona కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,44,14,186 కోట్లకి చేరింది.మరో వైపు కరోనాతో 501 మంది చనిపోయారు.దేశంలో నమోదైన 501 కరోనా మరణాల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే  రికార్డయ్యాయి. కేరళ రాష్ట్రంలో 419 మంది కరోనాతో మరణించినట్టుగా కేరళ రాష్ట్రం తెలిపింది. నిన్న ఒక్క రోజే కరోనా నుండి 13,155 మంది కోలుకున్నారు. ఇప్పటివకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,38,14,080కి చేరింది. 

కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,416 లక్షలకు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా యాక్టివ్ కేసులు  1 శాతం లోపుగా పడిపోయినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.267 రోజుల కనిష్టానికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య చేరుకొందని అధికారులు తెలిపారు. కరోనా రోగుల రికవరీ రేటు 98.26 గా రికార్డైంది. కరోనా రోగుల రికవరీ రేటు ఈ ఏడాది మార్చి తర్వాత అత్యధికమని ఐసీఎంఆర్ ప్రకటించింది.

ALso Read: కశ్మీర్‌లో థర్డ్ వేవ్? హాట్‌స్పాట్‌గా శ్రీనగర్.. పెరుగుతున్న కరోనా కేసులు

వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 1.10 శాతంగా నమోదైంది.  వీక్లి కరోనా పాజిటివిటీ రేటు 49రోజులుగా 2 శాతానికి తక్కువగా నమోదౌతుంది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.07 శాతంగా రికార్డైంది. 39 రోజులుగా 2 శాతం కంటే రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.62,690 లక్షలకు చేరుకొంది. ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. 

సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి. డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి. గత 24 గంటల్లో 53.81 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 110.79 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారని  ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలోని 71 శాతం జనాబా కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ ను తీసుకొన్నారు. దాదాపుగా 35 శాతం ప్రజలు కరోనా రెండు డోసులను తీసుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios