తెలంగాణ (Telangana)లో కొత్తగా 134 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 201 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,693 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 25,900 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 134 పాజిటివ్‌ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6,79,564కి చేరింది. నిన్న కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో వైరస్ వల్ల (corona deaths in telangana) తెలంగాణ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,015కి చేరుకుంది. కరోనా నుంచి నిన్న 201 మంది కోలుకున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం రికవరీల సంఖ్య 6,71,856కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 3,693 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 20కి చేరిన విషయం తెలిసిందే. ఇక ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆదివారం 532 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో అతని శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపారు. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి 7,206 మంది ప్రయాణికులు తెలంగాణకు రాగా.. వారిలో 20 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. మరో నలుగురి ఫలితాలు రావాల్సి ఉంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 1, జీహెచ్ఎంసీ 82, జగిత్యాల 0, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 1, ఖమ్మం 4, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 1, మంచిర్యాల 3, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 3, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 1, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 4, పెద్దపల్లి 0, సిరిసిల్ల 0, రంగారెడ్డి 9, సిద్దిపేట 6, సంగారెడ్డి 4, సూర్యాపేట 1, వికారాబాద్ 0, వనపర్తి 4, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 5, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Scroll to load tweet…