దేశంలో పబ్ జీ గేమ్ యువత, చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే వుంది. ఏదో విధంగా ఈ ప్రాణాంతక గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్న పిల్లలు, టీనేజర్లు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు.

దేశంలో పబ్ జీ గేమ్ యువత, చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే వుంది. ఏదో విధంగా ఈ ప్రాణాంతక గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్న పిల్లలు, టీనేజర్లు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లి సంగీత్ నగర్‌లో పబ్ జీ కారణంగా విషాదం చోటు చేసుకుంది. పబ్ జీ గేమ్ ఆడనివ్వలేదనే మనస్తాపంతో 12 ఏళ్ల మణికంఠ అనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు ఫోన్ కొనిస్తే.. పబ్ జీ గేమ్ ఆడటం మొదలేట్టాడు మణికంఠ. ఈ ఆన్‌లైన్ గేమ్‌లో పూర్తిగా లీనమైన బాలుడు చివరికి ప్రాణాలు తీసుకుని కన్నవారికి శోకాన్ని మిగిల్చాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred