24 గంటల్లో 106 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,72,052కి చేరిన మొత్తం కరోనా కేసులు
తెలంగాణ (Telangana)లో కొత్తగా 106 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) మరణించారు. 179 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,961 యాక్టివ్ కేసులు వున్నాయి.
తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 22,650 కరోనా పరీక్షలు నిర్వహించగా, 106 పాజిటివ్ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే (49) నమోదయ్యాయి. జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, (corona deaths in telangana) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,72,052కి చేరుకుంది. 6,64,212 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో 3,879 యాక్టీవ్ కేసులు వున్నాయి. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,961కి పెరిగింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 49, జగిత్యాల 0, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 5, ఖమ్మం 7, మహబూబ్నగర్ 2, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 0, మంచిర్యాల 1, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 5, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 2, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 1, పెద్దపల్లి 4, సిరిసిల్ల 1, రంగారెడ్డి 9, సిద్దిపేట 1, సంగారెడ్డి 3, సూర్యాపేట 2, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ 2, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.