24 గంటల్లో 104 కేసులు.. తెలంగాణలో 6,68,722కి చేరిన మొత్తం కరోనా కేసులు
తెలంగాణ (Telangana)లో కొత్తగా 104 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు (corona deaths in telangana) మరణించారు. 218 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,056 యాక్టివ్ కేసులు వున్నాయి.
తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 20,377 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 104 పాజిటివ్ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనాతో కారణంగా నిన్న ఒకరు మృతి చెందారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు (corona deaths in telangana) కోల్పోయిన వారి సంఖ్య 3,936కి చేరింది. వైరస్ బారి నుంచి 24 గంటల్లో 218 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,056 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు బులిటెన్లో పేర్కొన్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,68,722 కేసులు నమోదవ్వగా.. వీరిలో 6,60,730 మంది కోలుకున్నారు.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 1, జీహెచ్ఎంసీ 48, జగిత్యాల 1, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 4, ఖమ్మం 5, మహబూబ్నగర్ 3, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 1, మంచిర్యాల 0, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 4, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 5, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 1, పెద్దపల్లి 1, సిరిసిల్ల 0, రంగారెడ్డి 7, సిద్దిపేట 2, సంగారెడ్డి 3, సూర్యాపేట 1, వికారాబాద్ 0, వనపర్తి 3, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 4, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.