300 మిలియన్లకు పైగా చందాదారులతో భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్టెల్లో 1.28% వాటాను కొనుగోలు చేయడానికి700 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ తెలిపింది అలాగే టెల్కోతో మల్టీ-ఇయర్ బిజినెస్ ఒప్పందాలను అన్వేషించడానికి 300 మిలియన్ల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనుంది.
డిజిటల్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడానికి అలాగే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎయిర్టెల్(Airtel), గూగుల్(Google) ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా గూగుల్ ఎయిర్టెల్ లో 'Google for India Digitalization Fund' నుండి 1 బిలియన్ వరకు పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ఈ పెట్టుబడులలో ఈక్విటీ పెట్టుబడులు అలాగే వాణిజ్య ఒప్పందాల కోసం నిధులు ఉంటాయి. ఈ ఫండ్ వచ్చే ఐదేళ్లలో దేశాన్ని డిజిటలైజేషన్ చేయడానికి అవసరమైన ప్రాంతాల గుర్తింపుపై పరస్పర అంగీకారంతో ఉపయోగించబడుతుంది.
ఈ పెట్టుబడిలో గూగుల్ స్వర్ భారతి ఎయిర్టెల్లో ఒక్కో షేరుకు INR 734 ధరలో $700 మిలియన్ల ఈక్విటీ పెట్టుబడి ఉంది. ఇందులో $300 మిలియన్ల వరకు వాణిజ్య ఒప్పందాల అమలుకు వినియోగిస్తారు. ఇందులో ఎయిర్టెల్ ఉత్పత్తులు, సేవలను విస్తరించడంలో పెట్టుబడులు ఉంటాయి. అలాగే ఇది భారతదేశం డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో యాక్సెస్ను విస్తరించడం, డిజిటల్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా ఉన్న ఇన్నోవేషన్ ప్రోగ్రామ్లను కలిగి ఉంది. అదనంగా వివిధ సేవలు ఇంకా సాధనాలు కూడా అభివృద్ధి చేయబడతాయి.
భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ, “వినూత్న ఉత్పత్తుల ద్వారా భారతదేశ డిజిటల్ డివిడెండ్ను పెంచడానికి ఎయిర్టెల్, గూగుల్ ఉమ్మడి దృష్టిని పంచుకుంటున్నాయి. మా ఫ్యూచర్-రెడీ నెట్వర్క్, డిజిటల్ ప్లాట్ఫారమ్, డెలివరీ అండ్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థతో భారతదేశం డిజిటల్ పర్యావరణ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి గూగుల్ తో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము."అని అన్నారు.
భారతదేశ అవసరాలకు ప్రత్యేకంగా సరిపోయే డిజిటల్ పరిష్కారాలను రూపొందించడానికి ఎయిర్టెల్, గూగుల్ రెండూ కలిసి పెట్టుబడి పెట్టడానికి ఇంకా విస్తృత శ్రేణిలో సహకరించడానికి అంగీకరించాయి. ఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా వినూత్న సరసమైన ప్రోగ్రామ్ల ద్వారా వినియోగదారులకు అనేక రకాల అండ్రాయిడ్-ఎనేబుల్ టూల్స్ అందించడంతో పాటు అత్యుత్తమ గూగుల్-ఎయిర్టెల్ సేవలు ఇంకా ఆఫర్లను తీసుకురావడానికి Airtel Google కలిసి పని చేస్తాయి.
అలాగే, రెండు కంపెనీలు వివిధ పరికరాల తయారీదారులతో భాగస్వామ్యంతో, ప్రైస్ పాయింట్స్ సిరీస్లోని స్మార్ట్ఫోన్ వినియోగదారుల పరిమితులను తగ్గించడానికి అందుబాటులో ఉన్న అవకాశాలు గుర్తించడం కొనసాగిస్తుంది. ఈ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి భారతదేశంలో క్లౌడ్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడం, అభివృద్ధి చేయడంపై రెండు కంపెనీలు దృష్టి సారించాయి. ఎయిర్టెల్ ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ ఆఫర్తో ఒక మిలియన్కు పైగా చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు సేవలు అందిస్తోంది ఇంకా ఈ భాగస్వామ్యం డిజిటలైజేషన్ను వేగవంతం చేయడంలో వారికి సహాయపడుతుంది.
వ్యూహాత్మక లక్ష్యాలలో భాగంగా రెండు కంపెనీలు 5G, ఇతర ప్రమాణాల కోసం ఇండియా-స్పెసిఫిక్ నెట్వర్క్ డొమైన్ యుసెజ్ కేసులను అత్యాధునిక అమలులతో సమర్థవంతంగా పరిష్కరించగలవు. Airtel ఇప్పటికే Google 5G-రెడీ ఎవాల్వ్డ్ ప్యాకెట్ కోర్ అండ్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ ప్లాట్ఫారమ్ను ఉపయోగిస్తోంది. ఇంకా వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ అనుభవాన్ని అందించడానికి Google నెట్వర్క్ వర్చువలైజేషన్ సొల్యూషన్స్ లభ్యతను పెంచాలని యోచిస్తోంది.
