Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో కొత్త జూమ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం ...

భారతదేశంలో గత కొన్ని నెలలుగా కంపెనీ భారీ వృద్ధిని కనబరిచింది. ఇందుకోసం ఇండియాలో పెద్ద ప్రణాళికలు ఉన్నాయని జూమ్ తెలిపింది. జనవరి 2020  నుండి ఏప్రిల్ వరకు భారతదేశంలో ఉచిత సైన్-అప్ ద్వారా జూమ్ 6700 శాతం వృద్ధిని సాధించింది. 

zoom soon to launch new technology centre in banglore
Author
Hyderabad, First Published Jul 21, 2020, 4:02 PM IST

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి  సమయంలో అగ్రస్థానానికి ఎదిగిన వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ బెంగళూరులో కొత్త టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. కొత్త సాంకేతిక కేంద్రం సంస్థ ప్రస్తుత ఆర్&డి కేంద్రాలను "భర్తీ చేస్తుంది". జూమ్ ఇంజనీరింగ్ లీడర్ షిప్ సపోర్ట్ ఇస్తుందని జూమ్ తెలిపింది.

"మాకు ప్రపంచ స్థాయి బృందం ఉంది, కానీ వృద్ధిని కొనసాగించడానికి, మేము మార్కెట్ల అవసరాలను పరిష్కరించి తీర్చడానికి, మేము ఎదగాలి" అని జూమ్ ఉత్పత్తి, ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ వెల్చమి శంకర్లింగం చెప్పారు. "మా అనుభవం ఆధారంగా భారతదేశం ఉత్తమ ప్రతిభను కలిగి ఉంది." అని మీడియా లో తేలిపారు.

ఈ ప్రాంతంలో డేవ్ఒప్స్ ఇంజనీర్లు, ఐటి, సెక్యూరిటీ, బిజినెస్ ఆపరేషన్స్ హెడ్‌కౌంట్‌ను నియమించాలని కంపెనీ చూస్తున్నట్లు శంకర్లింగం తెలిపారు. నియామకం త్వరలో ప్రారంభమవుతుందని కూడా సూచించారు. భారతదేశంలో గత కొన్ని నెలలుగా కంపెనీ భారీ వృద్ధిని కనబరిచింది.

ఇందుకోసం ఇండియాలో పెద్ద ప్రణాళికలు ఉన్నాయని జూమ్ తెలిపింది. జనవరి 2020  నుండి ఏప్రిల్ వరకు భారతదేశంలో ఉచిత సైన్-అప్ ద్వారా జూమ్ 6700 శాతం వృద్ధిని సాధించింది. జూమ్ యాప్ చైనా దేశ యాజమాన్యంలో ఉందని సోషల్ మీడియాలో పుకార్లతో వెల్లడవుతున్న తరుణంలో భారతదేశంలో కొత్త టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభింనున్నట్లు ప్రకటన వచ్చింది.

also read రిలయన్స్ జియోఫోన్ వారికి షాకింగ్ న్యూస్.. ఆ రీఛార్జి ప్లాన్స్ రద్దు! ...

"మేము ఒక యుఎస్ కంపెనీ, మేము నాస్ డాక్ లో లిస్ట్  చేయబడింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో మా ప్రధాన కార్యాలయం ఉంది" అని జూమ్  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావా అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జూమ్ యాప్  సురక్షితమైన వేదిక కాదు అని భావించి భారత ప్రభుత్వం పరిశీలనలోకి తేచ్చింది.

భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ (సైకార్డ్) 16 పేజీల అడ్వైసరీలో ప్రభుత్వ ఉద్యోగులు జూమ్ యాప్ అధికారిక పని కోసం ఉపయోగించరాదని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి, లాక్  డౌన్ కారణంగా జనాదరణ పెరిగినప్పటికీ, జూమ్ ప్రపంచవ్యాప్తంగా ప్రైవసీ  అండ్ సెక్యూరిటి పరంగా ఎదురుదెబ్బ ఎదుర్కొంది.

తరువాత జూమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ ఎస్. యువాన్ భద్రతా లోపాలకు క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. క్రొత్త ఫీచర్స్ అభివృద్ధిపై వినియోగదారుల ప్రైవసీ  అండ్ సెక్యూరిటిపై దృష్టి పెడతామని ప్రతిజ్ఞ చేశారు. తరువాత కొత్త వెర్షన్ జూమ్ 5.0 విడుదల చేసింది. కానీ జూమ్ భారతదేశంలో ముఖ్యంగా స్థానిక ప్రత్యర్థుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

జియో మీట్ ప్రయోగం ఇలాంటి ఫీచర్లతో  జూమ్‌కు ప్రత్యక్ష పోటీగా కనిపిస్తుంది. కొత్త వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను రిలయన్స్  జియో ప్రవేశపెట్టినప్పటికి ఇందులో ఒకే విధమైన యూసర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. జియో మీట్ పూర్తిగా ఉచితం కూడా. జూమ్ యాప్ ఎయిర్‌టెల్ బ్లూజీన్స్‌తో కూడా గట్టి పోటీ పడుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios