Asianet News TeluguAsianet News Telugu

10వేల కోట్లు చెల్లించిన భారతి ఎయిర్‌టెల్...

చట్టబద్దమైన బకాయిల కోసం టెలికమ్యూనికేషన్ విభాగానికి (డిఓటి) రూ .10,000 కోట్లు చెల్లించినట్లు భారతి ఎయిర్‌టెల్ సోమవారం తెలిపింది. 

bharti airtel makes rs 10000 crore payment to telecom department
Author
Hyderabad, First Published Feb 17, 2020, 1:11 PM IST

న్యూ ఢిల్లీ:  టెలికాం సంస్థ గత వారం టెలికాం కంపెనీలకు తమ బకాయిలను వెంటనే తీర్చమని ఆదేశాలు జారీ చేసింది. చట్టబద్దమైన బకాయిల కోసం టెలికమ్యూనికేషన్ విభాగానికి (డిఓటి) రూ .10,000 కోట్లు చెల్లించినట్లు భారతి ఎయిర్‌టెల్ సోమవారం తెలిపింది.

also read ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్... ధర ఎంతంటే ?

భారతి ఎయిర్‌టెల్, భారతి హెక్సాకామ్, టెలినార్ తరఫున మొత్తం రూ .10,000 కోట్లు చెల్లించినట్లు భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. స్వయం మదింపు కసరత్తు పూర్తయిన తర్వాత మిగిలిన బకాయిల చెల్లింపు పూర్తిచేస్తామని కంపెనీ వెల్లడించింది. 

గత శుక్రవారం, టెలికమ్యూనికేషన్ విభాగం టెలికాం కంపెనీలకు భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలను తమ బకాయిలను వెంటనే తీర్చమని ఆదేశాలు జారీ చేసింది.

also read 15 వేల మంది ఫ్రెషర్స్‌కు క్యాప్ జెమినీ జాబ్స్.. కాగ్నిజెంట్ కూడా

 ఫిబ్రవరి 20లోగా రూ .10,000 కోట్లు, మిగిలినవి మార్చి 17 లోపు చెల్లించాలని డిఓటి  జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించి  భారతీ ఎయిర్‌టెల్ ఈ చెల్లింపులు చేసింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలతో సహా కంపెనీ దాదాపు రూ.35,586 కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉంది.

సోమవారం సెషన్‌లో భారతి ఎయిర్‌టెల్ షేర్లు 1.49 శాతం క్షీణించాయి. ఉదయం 11:14 గంటలకు ఎయిర్‌టెల్ స్టాక్ బిఎస్‌ఇలో ఒక్కొక్కటిగా 0.50 శాతం తగ్గి రూ .556.70 వద్ద ట్రేడవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios