అమ్మాయిలూ సిరీస్ గెలిచేశారు: 2 వన్డేలో కివీస్పై భారత మహిళల జట్టు విజయం
ఐదు వన్డేల సిరీస్లో ఇప్పటికే 3-0 తేడాతో గెలిచిన భారత్ చరిత్ర సృష్టించింది. అయితే పురుషులతో పాటు తామేం తక్కువ కాదన్నట్లు భారత మహిళల జట్టు కూడా కివీస్పై విజయం సాధించింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐదు వన్డేల సిరీస్లో ఇప్పటికే 3-0 తేడాతో గెలిచిన భారత్ చరిత్ర సృష్టించింది. అయితే పురుషులతో పాటు తామేం తక్కువ కాదన్నట్లు భారత మహిళల జట్టు కూడా కివీస్పై విజయం సాధించింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కివీస్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా చేధించింది. స్మృతీ మంథాన 90, మిథాలీ రాజ్ 63 పరుగులు చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయింది. గోస్వామి 3, బిషిత్ 2, డీబీ శర్మ 2, పూనమ్ యాదవ్ 2 వికెట్లు తీసి కీవీస్ను దెబ్బ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది.