Suhas Lalinakere Yathiraj : ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, పురుషుల సింగిల్స్ SL4 విభాగంలో ప్రపంచ నంబర్ 1గా ఉన్న సుహాస్ యతిరాజ్, గురువారం ఇండోనేషియాకు చెందిన హిక్మాత్ రామ్దానిపై అద్భుతమైన విజయంతో తన పారిస్ పారాలింపిక్స్ 2024 ప్రయాణం మొదలు పెట్టారు. 

India At Paris Paralympics 2024: ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, పురుషుల సింగిల్స్ SL4 విభాగంలో ప్రపంచ నంబర్ 1గా ఉన్న సుహాస్ యతిరాజ్ గురువారం ఇండోనేషియాకు చెందిన హిక్మాత్ రామ్దానిపై అద్భుతమైన విజయంతో తన పారిస్ పారాలింపిక్స్ 2024 ను ప్రారంభించాడు.

టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్న యతిరాజ్..  రామ్దానిని 21-7, 21-5తో నేరుగా సెట్లలో ఓడించి తన అధిపత్యాన్ని ప్రదర్శించాడు. మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది, యతిరాజ్ ప్రారంభం నుండి ముగింపు వరకు ఆధిపత్యం చెలాయించాడు. ఈ నిర్ణయాత్మక విజయం యతిరాజ్ తన అద్భుతమైన సేకరణకు మరో పారాలింపిక్ పతకాన్ని జోడించాలని చూస్తున్నందున అతనికి బలమైన ప్రారంభంగా చెప్పవచ్చు. పురుషుల సింగిల్స్ SL4 పోటీలో గ్రూప్ దశలో అతని పోరాటం అద్భుతంగా ఉంది. ఇది మరో మెడల్ ను అందుకోవడానికి ప్రారంభ పోరాటంలా సాగింది. 

Scroll to load tweet…

 

అలాగే, సుకాంత్ కదమ్ కూడా తన ప్రారంభ పురుషుల సింగిల్స్ SL4 గ్రూప్ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన మొహమ్మద్ అమీన్ బుర్హానుద్దీన్‌పై విజయం సాధించాడు. 31 ఏళ్ల ఈ భారత ప్లేయర్ 17-21 21-15 22-20 తో విజయాన్ని అందుకున్నాడు. ప్రారంభ గేమ్‌ను కోల్పోయిన తర్వాత అద్భుతమైన పునరాగమనం చేశాడు. డిసైడర్‌లో 16-20తో వెనుకబడిన అతను వరుసగా ఆరు పాయింట్లు సాధించి రెండు గేమ్ లతో విజయం సాధించాడు. 

ఐపీఎల్ 2025లో పాల్గొనే టాప్-6 టీ20 రిటైర్డ్ క్రికెట్ లెజెండ్స్ వీరే..