Asianet News TeluguAsianet News Telugu

నాలుగో వన్డే: కోహ్లీ లేని మ్యాచులో భారత్ పై కివీస్ ప్రతీకారం

హామిల్టన్ వన్డేలో న్యూజిలాండ్ భారత్‌పై ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కివీస్ చేధించింది. రాస్ టేలర్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 3 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కు రెండు వికెట్లు పడగొట్టాడు.

New zeland vs India: Fourth oneday updates
Author
Hamilton, First Published Jan 31, 2019, 7:55 AM IST

హామిల్టన్ వన్డేలో న్యూజిలాండ్ భారత్‌పై ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ లేని మ్యాచును భారత్ చిత్తుగా ఓడిపోయింది. టీమిండియా నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కివీస్ ఛేదించింది. రాస్ టేలర్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 3 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ విలియమ్సన్ భువనేశ్వర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి విజయానికి ఇంకా 54 పరుగుల దూరంలో న్యూజిలాండ్ నిలిచింది. 2 ఫోర్లు కొట్టి ఊపు మీదున్న ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 14 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది

హామిల్టన్‌లో జరిగిన నాలుగో వన్డేలో కివీస్ బౌలర్ల ధాటికి భారత్ చేతులెత్తేసింది. కేవలం 30.5 ఓవర్లలోనే 92 పరుగులకు అలౌటై న్యూజిలాండ్ ముందు 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కుల్‌దీప్, చాహల్ వంద పరుగుల మార్క్‌ను దాటించేందుకు శ్రమించినా న్యూజిలాండ్ బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. భారత బ్యాట్స్‌మెన్లలో చాహల్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బోల్ట్ 5, గ్రాండ్ హోమ్మీ 3 వికెట్లు తీశారు. 

కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు వణికిపోయారు. ఫోర్లతో ఒంటరి పోరాటం చేసిన హార్డిక్ పాండ్యా 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బోల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో  టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. గ్రాండ్ హోమ్మీ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 52 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయినట్లు అయ్యింది. 

న్యూజిలాండ్ పై జరిగిన నాలుగో వన్డే మ్యాచులో భారత్ పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనను కనబరిచింది. 35 పరుగులకే ఆరు వికెట్లో కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కేదార్ జాదవ్ ఒక్క పరుగు మాత్రమే చేసి బౌల్ట్ కు దొరికిపోయాడు.భారత్ 33 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. శుభమన్ గిల్ పరుగులు చేసి బౌల్ట్ బౌలింగులో అవుట్ కాగా, అంబటి రాయుడు, దినేష్ కార్తిక్ గ్రంథోమ్ బౌలింగులో డకౌట్ అయ్యారు.

భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింగి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్ కూడా అత్యల్ప స్కోరుకే అవుటయ్యారు. 23 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్ ను 13 పరుగులకు, రోహిత్ శర్మను 7 పరుగులకు బౌల్ట్ పెవిలియన్ కు పంపించాడు.

హామిల్టన్‌: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన నాలుగో వన్డేలో కివీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్‌ శర్మ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఇదివరకే 3-0తో సిరీస్‌ ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఆతిథ్య జట్టును క్లీన్‌ స్వీప్‌ చేయాలని చూసింది. మరో వైపు ఈ మ్యాచ్‌ గెలిచి పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్‌ భావించింది. భారత్ తుది జట్టులోకి కొత్త ఆటగాడు శుభమన్ గిల్ వచ్చాడు. గాయంతో బాధపడుతున్న ఎంఎస్ ధోనీ ఈ మ్యాచుకు కూడా దూరమయ్యాడు.

జట్లు

భారత్‌: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, ఖలీల్‌ అహ్మద్‌

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్తిల్‌, హన్రీ నికోల్స్‌, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌, టాడ్‌ ఆస్టిల్‌, మాట్‌ హన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌

Follow Us:
Download App:
  • android
  • ios