Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ.. ప్రభుత్వంతో ఒప్పందం

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఏపీలో క్రికెట్ అకాడమీ  ఏర్పాటు చేయనున్నారు

MS Dhoni Cricket Academy to be set up in Visakhapatnam
Author
Hyderabad, First Published Nov 17, 2018, 4:40 PM IST

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఏపీలో క్రికెట్ అకాడమీ  ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఆయన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. సుమారు రూ.60కోట్ల వ్యయంతో విశాఖలో ఈ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.

శనివారం ధోనీ కి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఫ్రైవేట్ లిమిటె్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్.. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఈ ఒప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో క్రికెట్ అకాడమీతోపాటు, ఇంటర్నేషనల్ స్కూల్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. కేవలం ఈ అకాడమీని క్రికెట్ కే పరిమితం చేయకుండా.. ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios