‘ఐపీఎల్ వేలం... కపిల్ రూ.25కోట్లు పలికేవాడు’
కపిల్ దేవ్ కనుక ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో ఉంటే రూ.25కోట్లు పలికి ఉండేవాడని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
టీం ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్ కనుక ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో ఉంటే రూ.25కోట్లు పలికి ఉండేవాడని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఐపీఎల్ -2019కి వేలం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గవాస్కర్ పైవిధంగా వ్యాఖ్యానించారు.కపిల్ గొప్ప ఆటగాడని గవాస్కర్ కొనియాడారు. కపిల్ జింబాంబ్వే పై ఆడిన(175 పరుగులు) ఇన్నింగ్స్ ని మళ్లీ తాను ఇంతవరకు చూడలేదన్నారు.
ఓ ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విశేషాల గురించి సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. ‘ఓ ఆటగాడిగా.. కామెంటేటర్గా వన్డే చరిత్రలోనే అదో గొప్ప ఇన్నింగ్స్. మళ్లీ ఇంతవరకు నేను అలాంటి గొప్ప ఇన్నింగ్స్ చూడలేదు. ఆ మ్యాచ్లో మేము 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాం. అప్పుడు చాలా చలిగా ఉంది. అంతేకాకుండా బంతి కూడా బాగా తిరిగింది. ఈ పరిస్థితుల్లో 70 లేక 80 పరుగులు కూడా చేస్తామనుకోలేదు. కానీ కపిల్ అద్బుత ఇన్నింగ్స్తో మ్యాచ్ను గెలిపించాడు. అతనేం నెమ్మదిగా ఆడలేదు. సిక్సర్లతో చెలరేగాడు. అతను కానీ తాజా ఐపీఎల్ వేలంలో ఉంటే కచ్చితంగా రూ.25 కోట్లు పలికేవాడు.’ అని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై కపిల్ నవ్వుతూ.. ఇంత వరకు అంత డబ్బును ఊహించలేదని చెప్పుకొచ్చాడు.