Asianet News TeluguAsianet News Telugu

Garuda panchami: గరుత్మంతుడిని పూజిస్తే.. ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసా?

నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యంగా పెడతారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు.

The Significance of garuda Panchami
Author
Hyderabad, First Published Nov 9, 2021, 1:58 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

సనాతన భారతీయ సంస్కృతిలో నాగపూజకి ఓ విశిష్టత ఉంది. శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. నాగ పంచమి ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే.. తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీమహావిష్ణువు శుక్ల పంచమి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు.

నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యంగా పెడతారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. నాగ పంచమి రోజున ‘విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్’ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజచేసిన వారికి విష బాధలుండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజూ నాగ పంచమి రోజున చదివినవారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు, రోగాలు రావు. వంశాభివృద్ధి, సంతానోత్పత్తి, కార్యసిద్ధి కలిగి కాలసర్ప దోషాలు, నాగ దోషాలు తొలగిపోతాయి.

కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు. వినతకి గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించారు. దీంతో సర్పజాతి జన్మించిన శుద్ధ పంచమిని‘నాగ పంచమి’గా పిలుస్తున్నారు. ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కాబట్టి శుద్ధ పంచమిని ‘గరుడ పంచమి’గా పేర్కొంటారు. పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కాబట్టి సర్పభయం పోవడానికి నాగపూజ చేస్తారు. అలాగే ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు ఉన్న మహిళలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది.

సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడే ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన సంతానం తాను గర్వించేలా, లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం ఇంద్రుడితోనే పోరాటం చేశాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఆశీస్సులు అందుకుని ఆయన వాహనంగా మారిపోయాడు. అలాంటి గరుత్మంతుని గరుడ పంచమి రోజున పూజిస్తే ఆరోగ్యవంతులు, ధైర్యవంతులైన సంతానం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios