Asianet News TeluguAsianet News Telugu

లండన్ బోనాలకు ఎమ్మెల్యే పద్మావతి: ఆత్మీయ సమ్మేళనం

ఎన్నారైల ఆహ్వానం మేరకు  లండన్ బోనాలకు విచ్చేసిన   కోదాడ కాంగ్రెసు ఎమ్మెల్యే  పద్మావతి రెడ్డి తో టీపీసీసీ ఎన్నారై సెల్  ఆధ్వర్యం లో   ఆత్మీయ  సమ్మేళనం  ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యే   పద్మావతి రెడ్డి  మాట్లాడారు.

MLA Padmavathi calls upon NRIs to help Congress

లండన్: ఎన్నారైల ఆహ్వానం మేరకు  లండన్ బోనాలకు విచ్చేసిన   కోదాడ కాంగ్రెసు ఎమ్మెల్యే  పద్మావతి రెడ్డి తో టీపీసీసీ ఎన్నారై సెల్  ఆధ్వర్యం లో   ఆత్మీయ  సమ్మేళనం  ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యే   పద్మావతి రెడ్డి  మాట్లాడారు.

కేంద్రం లో, రాష్ట్రం లో  నియంతృత్వ పాలన నడుస్తుందని అతి త్వరలనే  విముక్తి కలుగుతుందని పద్మావతిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రం  లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తధ్యమని  అన్నారు .  70 శాతం ఓట్లతో  రాష్ట్రంలో 90 సీట్లు  గెలుచుకునేలా   కార్యకర్తలు  పనిచే స్తున్నారని తెలిపారు. 

అనేక సందర్భాల్లో  ఈవీఎం  యంత్రాల పని తీరుపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని ఆమె అన్నారు. అభివృద్ధి , టెక్నాలజీలో ముందున్న దేశాల్లో  పేపర్ బ్యాలట్ నిర్వహిస్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో  ప్రజల  సందేహాలను దృష్టిలో పెట్టుకొని  పేపర్ బ్యాలెట్ నిర్వహించేలా ఎన్నారై లు కూడా చొరవ చూపాలని  అన్నారు. 


ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకే  యూరోప్ అధ్యక్షుడు  కమల్  మాట్లాడుతూ  ... బీజేపీ పాలన లో దేశం 100 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, సంపన్నులు  సంపాదనలో 100 ఏళ్లు   ముందుకు వెళ్లారని అన్నారు. ,ప్రధాని మోడీ  సంపన్నులకు సేల్స్ మాన్  గా పని చేస్తున్నారని , దళితులపై  దాడులు అరికట్టడంలో విఫలం అయ్యారని అన్నారు 

సభాధ్యక్షులు గా వ్యవహరించిన టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై లను నిర్లక్యం  చేస్తోందని  ఎన్నారై మంత్రి   కేటీర్  ఎన్నారై పాలసీ  అమల్లోకి తీసుకువచ్చే శ్రద్ద చూపడం లేదని అన్నారు. గల్ఫ్ కు వలస వెళ్లిన   లక్షలాది మంది రైతులు  రైతు బంధు పథకం  నిబంధనలతో నష్ట పోయారని  అన్నారు. నాలుగేళ్లు  నిద్ర పోయి  100 కోట్లు ఎన్నారై సంక్షేమం ప్రకటనకే పరిమితమైందని అన్నారు . 

టీపీసీసీ కో కన్వీనర్ సుధాకర్ రంగుల మాట్లాడుతూ...   2019 లో  కాంగ్రెస్  అధికారంలోకి రాగానే  యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తుందని, ప్రభుత్వ నియామకాలు చేస్తుందని అన్నారు.  

ఈ కార్యక్రమంలో  మహిళా అధ్యక్షురాలు  గురమిందర్  సింగ్, అస్రా  అంజుమ్ , రాకేష్ బిక్కుమండ్ల, మంగళారపు శ్రీధర్, బాలకృష్ణా రెడ్డి, అచ్యుత రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ ,మధు గట్ట  తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios