Asianet News TeluguAsianet News Telugu

మీ టూకు కౌంటర్ వుయ్ టూ: మగవాళ్లూ.. బయటకు రండి

హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం ఇప్పుడు భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మహిళలు ఒక్కొక్కరు గళం విప్పుతున్నారు. బాలీవుడ్‌లో సినీనటి తనుశ్రీ దత్తాతో మొదలైన మీటూ ఉద్యమం దక్షిణాదిన గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్లతో తీవ్ర రూపం దాల్చింది. ఎంతో మంది మహిళా జర్నలిస్టులు సైతం తాము ఎదుర్కొన్న వేధింపుల గోడు వెల్లబోసుకుంటున్నారు. 
 

woman journalist called we to due to sexual harassment on gents
Author
Delhi, First Published Oct 9, 2018, 6:50 PM IST

ఢిల్లీ: హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం ఇప్పుడు భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మహిళలు ఒక్కొక్కరు గళం విప్పుతున్నారు. బాలీవుడ్‌లో సినీనటి తనుశ్రీ దత్తాతో మొదలైన మీటూ ఉద్యమం దక్షిణాదిన గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్లతో తీవ్ర రూపం దాల్చింది. ఎంతో మంది మహిళా జర్నలిస్టులు సైతం తాము ఎదుర్కొన్న వేధింపుల గోడు వెల్లబోసుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ యువ గాయని ఆరోపించారు. పెద్ద మనిషి ముసుగులో ఆయన చేస్తున్న అకృత్యాల గురించి జర్నలిస్టు సంధ్య మీనన్‌తో సోషల్‌ మీడియాలో పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.  

అయితే తాజాగా ఆడవాళ్ల బారినపడి మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురయ్యారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. వుయ్ టూ అంటూ మగవాళ్లు సైతం తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై బయటకు రావాలని మహిళా జర్నలిస్ట్ సుభుహీ సాఫ్వీ పిలుపునిచ్చారు. సమాజంలో వర్క్ ప్లేస్ లో మహిళలు మాత్రమే లైంగిక వేధింపులకు గురవుతున్నారా...మగవాళ్లు గురవ్వడం లేదా అంటూ ప్రశ్నించారు. 

మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నాని లైంగిక వివక్ష అంశాలై ఆసక్తికమైన ఆర్టికల్స్ రాసే సుభుహీ సాఫ్వీ తన ఫ్రెండ్ ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. తన స్నేహితుడి మీడియాలో ఓ లేడీ బాస్ దగ్గర పనిచేసేవాడని ఆ లేడీ బాస్ ప్రతీరోజు అతన్ని లైంగికంగా వేధిస్తూ ఇబ్బంది పెట్టేదని ఆరోపించింది. 

ఆమె వేధింపులు తీవ్రమవ్వడంతో తన మిత్రుడు హెచ్ఆర్ విభాగానికి ఫిర్యాదు చేశారని తెలిపింది. ఇంతకాలం ఎంజాయ్ చేసి మోజు తీరాక వచ్చి ఫిర్యాదు చేస్తున్నావా అంటూ అతని ఫిర్యాదు ను స్వీకరించకుండా తిరస్కరించారట. దాంతో అతడు ఉద్యోగం మానేసి మరో మీడియాకు మారిపోయాడని తెలిపింది. 

మీ టూ ఉద్యమానికి నాంది పలికిన హాలీవుడ్‌ నిర్మాత హార్వీ విన్‌స్టైన్‌ ఇప్పుడు కోర్టులో కూడా ఇలాగే వాదిస్తున్నారని తెలిపింది. నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. సినిమా అవకాశాలు పొందారు. ఇష్టపూర్వకంగానే పడక సుఖం పొందారు. అన్ని తీరాక ఇప్పుడు లేట్‌ వయస్సులో నాపై అభాండాలు వేస్తున్నారు అని విన్ స్టైన్ అమెరికా కోర్టులో వాదించారట. అయితే అతని వాదనలో బలం ఉందా? ఉంటే ఆ వాదన మన బాలీవుడ్‌ పురుష పుంగవులకు వర్తించదా? అన్న చర్చ జరుగుతోంది. 

లైంగిక వేధింపులకు గురైన మగవాళ్లు కూడా ఉంటారని, వారంతా  ఇప్పుడు వుయ్‌ టూ అంటూ ముందుకు రావాలని సుభుహీ సాఫ్వీ పిలుపునిచ్చారు. డెమీ మూర్, మైఖేల్‌ డగ్లస్‌ నటించిన హాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘డిస్క్లోజర్‌‌’ కథ కూడా మహిళా బాస్ లైంగికంగా వేధించడమే కదా అని తెలిపారు. 

ప్రస్తుతం భారత్ లో అన్ని రంగాల్లో మీటూ ఉద్యమం ఊపందుకుందన్నది వాస్తవం. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ దగ్గరి నుంచి మీడియా మాజీ ఎడిటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్‌ వరకు లైంగిక వేధింపుల ఆరోపణల పర్వం కొనసాగుతోంది. 

కొందరేమో లైంగిక వేధింపులపై క్షమాపణలు చెబుతుంటే మరికొందరు స్పందించేందుకు తిరస్కరిస్తున్నారు. ఇంకొందరు ఖండిస్తున్నారు. పదేళ్ల క్రితం, 20ఏళ్ల క్రితం జరిగిన లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు వారు ఎందుకు మాట్లాడలేదు అని నిలదీస్తున్నారు. 

మహిళలకు మరింత భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ ఆఫ్‌ విమెన్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రెడ్రెస్సల్‌) యాక్ట్‌-2013 లో తీసుకు వచ్చినప్పటికీ ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు పరువు పోతుందని భయపడ్డారా? ఆ పరువు మరి ఇప్పుడు పోదా? ఈ వయస్సులో పోయినా ఫర్వాలేదా? ‘మీ టూ’ ఉద్యమం కారణంగా ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చామని చెబుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios