Asianet News TeluguAsianet News Telugu

భార్యను చంపి.. రెండు రాత్రులు శవంతో జాగారం చేసిన భర్త

అనుమానంతో భార్యను చంపి అనంతరం ఆమె శవంతో రాత్రంతా జాగారం చేశాడో భర్త. ఢిల్లీకి చెందిన కామిల్, రేష్మలకు మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది.

wife killed by husband in delhi
Author
Delhi, First Published Oct 22, 2018, 1:35 PM IST

అనుమానంతో భార్యను చంపి అనంతరం ఆమె శవంతో రాత్రంతా జాగారం చేశాడో భర్త. ఢిల్లీకి చెందిన కామిల్, రేష్మలకు మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. అంబేడ్కర్ యూనివర్సిటీలో ప్యూన్‌గా పనిచేస్తూ కుటుంబంతో పాటు కమలా మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో తన భార్య.. మరో ఇద్దరు యువకులతో సన్నిహితంగా ఉంటుందని కామిల్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్యతో వాగ్వావాదానికి దిగి కోపంలో ఆమె గొంతు నులిమి చంపేశాడు.

అయితే ఏం చేయాలో తెలియక శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తన రెండేళ్ల కూతురితో పాటు భార్య శవం పక్కనే కూర్చొని ఉండిపోయాడు. చివరికి ఆదివారం ఉదయం కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినది చెప్పి లొంగిపోయాడు.

పోలీసులు కామిల్ ఇంటికి వెళ్లి చూడగా.. అప్పటికే చనిపోయి రెండు రోజులు కావొస్తుండటంతో రేష్మ మృతదేహం నీలం రంగులోకి మారిపోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios