Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడు, తల్లితో కలిసి.. భర్త హత్య, ఏమీ ఎరగనట్టు అంత్యక్రియలు.. కొడుకు నోరు విప్పడంతో....

డిసెంబర్ 27న రాఘవేంద్రను ఇంట్లోనే ఊపిరాడకుండా చేసి చంపేశారు. Epilepsyతో మృతి చెందాడని శైలజ అందరికీ చెప్పి అంత్యక్రియలు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది.  అసలు విషయం ఏమిటో ఆ దంపతుల కొడుకు బంధువులకు చెప్పడంతో గుట్టురట్టయింది. 

wife assasinated husband with the help of lover and mother in karnataka
Author
Hyderabad, First Published Jan 13, 2022, 11:49 AM IST

బెంగళూరు :  ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ husbandనే కడతేర్చిన సంఘటన karnataka రాష్ట్రంలోని దొడ్డ పట్టణంలో వెలుగుచూసింది.  పది రోజుల తర్వాత ఆమె కొడుకు ఈ దారుణాన్ని బయటపెట్టాడు. పట్టణ పరిధిలోని కరేనహళ్లిలో నివసిస్తున్న నేత కార్మికుడు రాఘవేంద్ర హతుడు కాగా,  ఇతని భార్య శైలజ, ప్రియుడు హనుమంతు ముఖ్య నిందితులు.

ఈ ఘోరానికి  శైలజ తల్లి లక్ష్మీదేవి సహకరించడం గమనార్హం.  డిసెంబర్ 27న రాఘవేంద్రను ఇంట్లోనే ఊపిరాడకుండా చేసి చంపేశారు. Epilepsyతో మృతి చెందాడని శైలజ అందరికీ చెప్పి అంత్యక్రియలు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది.  అసలు విషయం ఏమిటో ఆ దంపతుల కొడుకు బంధువులకు చెప్పడంతో గుట్టురట్టయింది. 

గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్తున్న శైలజకు అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హనుమంతు అనే  కూలీతో extra marital affair పెట్టుకుంది. ఇది తెలిసిన రాఘవేంద్ర భార్యతో గొడవ పడ్డాడు. మరోవైపు హనుమంతు భార్య కూడా శైలజతో గొడవపడి కొట్టింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని నిద్రపోతున్న భర్తను ప్రియుడు, తల్లి సహకారంతో హత్య చేసింది. పోలీసులు శైలజ, హనుమంతు, లక్ష్మీదేవిలను అరెస్టు చేశారు. 

ఇదిలా ఉండగా, విలాసవంతమైన జీవితం కోసం డబ్బులు అడుగుతుందని కట్టుకున్నwifeనే కడతేర్చాడో ప్రబుధ్దుడు. తల మీద కట్టెతో కొట్టి హతమార్చిన భర్త.. deadbodyన్ని పంట పొలాల్లోకి తీసుకెళ్లి కాల్చేశాడు. పూర్తిగా కాలకపోవడంతో murder విషయం బయటకు వచ్చింది. 

రంగంలోకి దిగిన కామారెడ్డి జిల్లా పోలీసులు నిందితులను కటకటాల్లోకి పంపించారు. కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సరదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని బల్ రాం పూర్ జిల్లాకు చెందిన ఫాతిమా ఖాతూన్ (26), రంజాన్ ఖాన్ దంపతులు ఉపాధి కోసం మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ ప్రాంతానికి వలస వచ్చారు. 

వీరికి నలుగురు పిల్లలు.. కూలీ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకునే వారు. అయితే, ఫాతిమాకు విలాసవంతంగా బతకాలనే ఆశ ఉండేది. ఇందుకోసం డబ్బులు కావాలని భర్తను ఇబ్బంది పెడుతుండేది.  ఇది మనసులో పెట్టుకున్న భర్త రంజాన్ ఖాన్ భార్యను చంపాలని ప్లాన్ వేశాడు. డిసెంబర్ 24న ఫాతిమా తల మీద దుడ్డు కర్రతో బలంగా కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు తన స్నేహితులు రియాజ్ ఖాన్, పూజన్ లతో కలిసి పథకం రచించాడు. 

అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బొలెరో వాహనంలో మృతదేహాన్ని తీుకుని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ శివారుకు చేరుకున్నారు. పంట పొలాల్లో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. అయితే, పొలాల్లోకి వెళ్లిన రైతులకు సగం కాలిన శవం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios