న్యూఢిల్లీలో ఎన్కౌంటర్: కాంట్రాక్టు కిల్లర్ కమిల్ కు గాయాలు, అరెస్ట్
కాంట్రాక్టు కిల్లర్ కమిల్ ను న్యూఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఎన్ కౌంటర్ లో గాయపడిన తర్వాత కమిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు
న్యూఢిల్లీ: కాంట్రాక్టు కిల్లర్ కమిల్ ను న్యూఢిల్లీలో పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఎన్కౌంటర్ తర్వాత కమిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్టు కిల్లర్ గా కమిల్ పై పలు కేసులు నమోదయ్యాయి. గురువారంనాడు ఉదయం న్యూఢిల్లీలోని రోహిణి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో కమిల్ గాయపడ్డాడు. అనంతరం కమిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కమిల్ ను లొంగిపోవాలని కోరిన సమయంలో అతను పోలీసులపై కాల్పులకు దిగాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో కమిల్ కాలికి గాయాలయ్యాయి. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై 12 కేసులు నమోదయ్యాయి.
గాయపడిన కమిల్ నుండి టర్కీలో తయారీ జిగానా పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాఫియా డాన్ అతిక్ అహ్మద్ కూడ జిగానా పిస్ట్ ఉపయోగించడం గమనార్హం.