రాజద్రోహం కేసు: ఎండిఎంకె నేత వైకోకు ఏడాది జైలు
ఎండిఎంకె నేత, తమిళనాడు రాజకీయాల్లో కీలకనేత వైకోకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ చెన్నై కోర్టు శుక్రవారం నాడు తీర్పు వెల్లడించింది.
చెన్నై: ఎండిఎంకె నేత, తమిళనాడు రాజకీయాల్లో కీలకనేత వైకోకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ చెన్నై కోర్టు శుక్రవారం నాడు తీర్పు వెల్లడించింది.
రాజద్రోహం కేసులో వైకోకు కోర్టు ఈ మేరకు ఏడాది పాటు జైలు శిక్షను విధించింది. 2009లో ప్రభుత్వంపై వైకో తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలపై నమోదైన కేసులపై చెన్నై కోర్టు శుక్రవారం నాడు ఈ తీర్పును ఇచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానాను విధించింది.
ఐయామ్ అక్యూసింగ్ పేరుతో వైకో రాసిన పుస్తకావిష్కరణ సమయంలో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా వైకో విమర్శలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.