దారుణం : ప్రతీకారం కోసం.. సొంత మనవరాలినే చంపిన 70యేళ్ల వృద్ధ జంట.. !
తమ కొడుకును రేప్ కేసులో ఇరికించినందుకు.. పొరుగువారిమీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ వృద్ధ జంట దారుణానికి తెగబడింది. తమ ఎనిమిదేళ్ల మనవరాలిని పాశవికంగా హత్య చేశారు. విషయం వెలుగులోకి రావడంతో దీనికి కారణమైన వృద్ధ దంపతులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అలీగఢ్ : ఉత్తర ప్రదేశ్ లో నమ్మశక్యం కాని దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 70యేళ్ల వృద్ధ జంట తమ ఎనిమిదేళ్ల మనవరాలి(Granddaughter)ని స్వయంగా పొట్టనపెట్టుకున్నారు(Murder). ఏమీ ఎరగనట్టు పాప కనిపించడం లేదని నాటకం ఆడారు. ఇదంతా పొరుగు వారిని కేసులో ఇరికించి, ప్రతీకారం (Settle Scores)తీర్చుకోవడానికే అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
తమ కొడుకును రేప్ కేసులో ఇరికించినందుకు.. పొరుగువారిమీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ వృద్ధ జంట దారుణానికి తెగబడింది. తమ ఎనిమిదేళ్ల మనవరాలిని పాశవికంగా హత్య చేశారు. విషయం వెలుగులోకి రావడంతో దీనికి కారణమైన వృద్ధ దంపతులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
70 ఏళ్ల వయసున్న లేఖరాజ్, సంపత్ తమ పొరుగువారిని అరెస్ట్ చేయించాలని ప్రయత్నిస్తుంచారు. కారణం వారు ఇటీవల తమ కుమారుడిని వేధింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించి కేసులో ఇరికించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 20 న టప్పల్ ప్రాంతంలోని ఒక గ్రామంలో బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. కాగా బాలిక మేనమామ అత్యాచారం కేసులో నిందితుడిగా, జైలులో ఉన్నాడా అనేది నిర్ధారించబడలేదు.
ఈ వృద్ధ దంపతులు పాత కేసులో తమ పక్కింటి వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పాపను వారే చంపారని చెప్పడానికి... వీలుగా తమ సొంత మనుమరాలిని చంపాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు.
సీనియర్ పోలీసు అధికారి కళానిధి నైతాని మాట్లాడుతూ, పక్కా సాక్ష్యాలతో పోలీసులు వారిని ప్రశ్నించినప్పుడు వృద్ధ దంపతులు నేరాన్ని అంగీకరించారని చెప్పారు. విషయం ఎలా బయటపడిందంటే.. ఆ బాలిక చాలా వారాలుగా పాఠశాలకు హాజరు కావడం లేదు. దీంతో అనుమానం వచ్చి స్కూలు యాజమాన్యం వారిని ప్రశ్నించగా.. పాప స్కూల్ కే వెళ్లిందని చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
పరువు హత్యలు.. నిందితుడికి ఉరిశిక్ష..!
నేరం తమ మీద రాకుండా ఉండాలని, బాలిక స్కూల్ కు వెళ్లి మాయమైందన్న తమ కట్టుకథను నిజం చేయడానికి బాలిక స్కూల్ బ్యాగ్ను నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో పడేశారని పోలీసులు పేర్కొన్నారు. బాలిక మృతదేహాన్ని వెలికితీసిన ప్రదేశంలో వృద్ధ దంపతులు అనుమానాస్పదంగా కనిపించినట్లు, వారిని చాలా మంది చూసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘాతుకానికి పాల్పడడం వెనుక ఆర్థిక ఇబ్బందులే కారణం అని తెలిసింది. అత్యాచారం కేసులో న్యాయ పోరాటానికి వారికి అయిన చట్టపరమైన ఖర్చులు ఆ కుటుంబాన్ని పేదరికంలో నెట్టాయని. ఇది అమ్మాయిని చంపడానికి దారితీసిందని పోలీసులు తెలిపారు.