జమ్మూ ఉగ్రదాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరామర్శ
Srinagar: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ చేరుకున్నారు. రాజౌరిలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అలాగే, అక్కడి అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష జరపనున్నారు.
Union Home Minister Amit Shah: జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఇటీవల జరిగిన జంట ఉగ్రదాడుల్లో మరణించిన వారి కుటుంబాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవనున్నారు. అమిత్ షా ఇప్పటికే జమ్మూ చేరుకున్నారు. రాజౌరిలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అలాగే, అక్కడి అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష జరపనున్నారు. ఈ ప్రాంతంలోని హిందూ కుటుంబాలపై లక్ష్యంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా పరిస్థితిని కూడా షా సమీక్షించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి 1, 2 తేదీల్లో రాజౌరి ఎగువ డాంగ్రీ గ్రామంలో జరిగిన రెండు ఉగ్రదాడుల్లో ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు పౌరులు మరణించారు. అలాగే, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడుల తర్వాత 2,000 మందికి పైగా అదనపు పారామిలటరీ బలగాలను రాజౌరికి తరలించారు. అధికారులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టినా దాడికి పాల్పడిన వారి జాడను ఇంకా తెలియలేదు.
గత మూడు నెలల్లో షా జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్లో హోంమంత్రి రాజౌరిలో పర్యటించి బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. ఉగ్రదాడుల బాధితుల కుటుంబాలను, డాంగ్రీ గ్రామంలోని స్థానికులను కలిసిన తర్వాత, కేంద్ర మంత్రి అమిత్ షా జమ్మూకు తిరిగి ఉన్నత స్థాయి భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, అన్ని ఇంటెలిజెన్స్, పారామిలటరీ సంస్థల చీఫ్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. డాంగ్రీ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతోంది.
ప్రభుత్వం రాజౌరిలో గ్రామ రక్షణ సమూహాలను పునరుద్ధరించింది. సాధ్యమయ్యే ఉగ్రవాద దాడుల నుండి రక్షించడానికి పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలకు కొత్త రైఫిల్స్ను అందిస్తోంది. ఇదిలా ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం భద్రత-రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేతలు, అరుణ్ కుమార్, BL సంతోష్ సహా జమ్మూలో వరుస సమావేశాలు నిర్వహించారు. గ్రామ రక్షక బృందాలను బలోపేతం చేయాలనీ, వాటికి మరిన్ని ఆయుధాలు ఇవ్వాలని బీజేపీ గట్టిగా సమర్ధిస్తోంది. జమ్మూ ప్రాంతంలో 28,000 గ్రామ రక్షణ బృందాలు ఉన్నాయి. ఆయుధాలు ఇచ్చిన సభ్యులలో ఎక్కువ మంది హిందువులుగా ఉన్నట్టు సమాచారం.
జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతలు కుప్పకూలినప్పుడు దాదాపు 30 ఏళ్ల క్రితం దోడా జిల్లాలో గ్రామ రక్షణ కమిటీలు (VDC) ఏర్పాటయ్యాయి. సాధారణ ప్రజలను రక్షించే బాధ్యతను విస్మరించినందుకు-గ్రామస్తులకు ఉగ్రవాద దాడుల నుండి రక్షించడంలో సహాయపడటానికి అప్రమత్తమైన సమూహాలకు ఆయుధాలు ఇచ్చినందుకు పరిపాలన విమర్శించబడింది. చివరికి, భద్రతా దళాలు పరిస్థితిని తిరిగి నియంత్రించడంతో VDCల పాత్ర తగ్గింది. చాలా ప్రాంతాల్లో, విజిలెంట్ గ్రూపులకు కేటాయించిన ఆయుధాల దుర్వినియోగాన్ని నిరోధించడం తీవ్రమైన ఆందోళనగా ఉంది. అయితే ప్రతి కుటుంబానికి ఆయుధాలు ఇవ్వడం ద్వారానే ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. "గ్రామ రక్షణ బృందాలు, ప్రతి ఇంటిలో ఆయుధాలు ఉన్నప్పుడు మిలిటెన్సీని అరికట్టవచ్చు" అని బీజేజీ నాయకుడు, డాంగ్రీ సర్పంచ్ ధీరజ్ శర్మ చెప్పినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.