ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా యరో 50 మంది గాయపడ్డారు. 

Uttar Pradesh Accident : ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పట్‌లో ఆదినాథుని నిర్వాణ లడ్డూ ఉత్సవానికి మంగళవారం భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలో మనస్తంభ కాంప్లెక్స్ లో చెక్కవేదిక (వాచ్ టవర్) కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
Scroll to load tweet…

ఒక్కసారిగి వాచ్ టవర్ కుప్పకూలడంతో అసలు ఏం జరిగిందో అర్థంకాక అక్కడున్న భక్తులు గందరగోళానికి గురయ్యారు. ఈ షాక్ నుండి తేరుకునేలోపే చుట్టుపక్కల గాయాలతో పడివున్నవారు కనింపించారు... దీంతో వెంటనే అప్రమత్తమై వారిని కాపాడే ప్రయత్నంచేసినా అంబులెన్స్ లు అందుబాటులో లేవు.దీంతో ఆటో రిక్షాల్లో క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించాల్సి వచ్చింది. 

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాగ్ ఫట్ జిల్లా ఎస్పీ అర్పిత్ విజయవర్గియ్ ఈ ఘటనపై స్పందించారు. జైన్ కమ్యూనిటీ నిర్వహిస్తున్న లడ్డు మహోత్సవ్ లో ప్రమాదం జరిగిందని... ఇప్పటికే పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారని తెలిపారు. తమకు అందుతున్న సమాచారం మేరకు 20 నుండి 30 మంది గాయపడ్డట్లు, వీరిలో 2 లేదా 3 ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.

Scroll to load tweet…

ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రియాక్ట్ అయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ఘటన దురదృష్టకరమని... గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని యోగి ఆదిత్యనాథ్ కోరుకున్నారు.