Asianet News TeluguAsianet News Telugu

న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో కూలిన నిర్మాణం: ఎనిమిది మంది కార్మికులకు గాయాలు


న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం గేట్ సమీపంలో  తాత్కాలిక నిర్మాణం కుప్పకూలింది.ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. 

Temporary structure near Jawaharlal Nehru Stadium gate collapses, 8 injured lns
Author
First Published Feb 17, 2024, 1:10 PM IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని  జవహర్ లాల్ నెహ్రు స్టేడియం గేట్ సమీపంలోని తాత్కాలిక నిర్మాణం కుప్పకూలడంతో  ఎనిమిది మంది గాయపడ్డారు. జవహర్ లాల్ నెహ్రు కు స్టేడియం   రెండో నెంబర్ గేట్ కు సమీపంలో  నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల్లో  కొంత భాగం కూలిపోయింది. నిర్మాణ భాగంలోని శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు.ఇందులో  ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే  పోలీసులు,  అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో గాయపడిన కార్మికులను  ఆసుపత్రికి తరలించారు. ఈ శిథిలాల కింద ఇంకా కొందరు కార్మికులు చిక్కుకున్నారేమోననే అధికారులు ఆరా తీస్తున్నారు.  ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఓ పెళ్లి కోసం తాత్కాలిక నిర్మాణాన్ని ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. కార్మికులు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో  నిర్మాణ పనుల్లో ఎక్కువ మంది కార్మికులు లేరు.  దీంతో ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎక్కువగా లేరు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న కార్మికులు గాయపడ్డారని ప్రత్యక్షసాక్షులు చెప్పారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios