హోం వర్క్ చేయలేదని కొట్టి చంపిన టీచర్.. ఆ పిల్లాడు యాక్టింగ్ చేస్తున్నాడని తండ్రికి వివరణ
హోం వర్క్ చేయలేదని ఓ టీచర్ ఏడో తరగతి విద్యార్థిని చితకబాదాడు. పిడిగుద్దులు గుద్దాడు. కాలితోనూ తన్నాడు. ఈ దెబ్బలు తట్టుకోలేక సదరు విద్యార్థి స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. అనంతరం మరణించాడు. కాగా, ఆ విద్యార్థి తండ్రికి నిందిత టీచర్ ఫోన్ చేసి ఆయన కుమారుడు మరణించినట్టు యాక్టింగ్ చేస్తున్నట్టు తెలిపాడు.
జైపూర్: Rajsthanలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. Home Work చేయలేదని ఏడవ తరగతి విద్యార్థిని ఓ కర్కష ఉపాధ్యాయుడు చితకబాది చంపేశాడు. అంతేకాదు, ఆ పిల్లాడు నిజంగా చనిపోలేదని, మరణించినట్టు యాక్టింగ్ చేస్తున్నాడని తండ్రికి చెప్పాడు. ఈ ఘటన రాజస్తాన్లోని చురి జిల్లా సలాసర్ గ్రామంలో చోటుచేసుకుంది.
13ఏళ్ల student తన హోం వర్క్ చేయలేదు. హోం వర్క్ చేయలేదని ఆ స్కూల్ teacher ఒంటికాలిపై లేచాడు. కర్రలతో ఆ విద్యార్థిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దెబ్బలతో విద్యార్థి స్పృహ కోల్పోయాడు. నేలపై పడిపోయాడు. ఎంత లేపినా లేవలేదు. దీంతో ఆ పిల్లాడి తండ్రికి ఫోన్ చేశాడు. హోం వర్క్ చేయనందుకు ఆ పిల్లాడిని కొట్టాడని, తర్వాత కిందపడి చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నాడని చెప్పాడు.
పంటపొలంలో పనిచేస్తున్న ఆ విద్యార్థి తండ్రి ఒక్కసారిగా హైరానాపడ్డాడు. వెంటనే ఆ ప్రైవేటు స్కూల్కు పరుగెత్తాడు. అప్పటికే ఆయన భార్య అక్కడికి చేరి బోరుమని విలపిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు భయభ్రాంతుల్లో ఉన్నారు.
Also Read: ప్రియుడితో ఏకాంతంగా కనిపించిన కూతురు.. ఒళ్లుమండిన తండ్రి చేసిన పని...
ఈ ఘటనపై సలాసర్ ఎస్హెచ్వో సందీప్ విష్ణోయ్ వివరాలు తెలిపారు. కొలాసర్ నివాసి ఓంప్రకాశ్ కుమారుడు ఓ ప్రైవేటు స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. గత 15 రోజులుగా టీచర్ మనోజ్ కుమార్ తన కొడుకును అకారణంగా కొడుతున్నట్టు చెప్పాడని పోలీసు వివరించాడు. టీచర్ మనోజ్.. ఆ విద్యార్థిని తీవ్రంగా కొట్టాడని తోటి విద్యార్థులు తెలిపారు. పిడిగుద్దులు గుద్దారని, కాలితోనూ తన్నారని చెప్పారు. అప్పుడు ఆ విద్యార్థిని సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే సదరు విద్యార్థి మరణించాడని డాక్టర్లు తెలిపారు.