మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన పెయింటర్.. పెళ్లి చేసుకుని లైంగిక వేధింపులు.. చివరకు..
తమిళనాడులోని సేలం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను అపహరించిన పెయింటర్.. పెళ్లి చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేరానికి పాల్పడిన పెయింటర్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
తమిళనాడులోని సేలం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను అపహరించిన పెయింటర్.. పెళ్లి చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేరానికి పాల్పడిన పెయింటర్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాకు చెందిన రంగనాథన్ అనే 26 ఏళ్ల యువకుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను ప్రేమించారు. అయితే ఆమెను కిడ్నాప్ చేసి.. సేలంలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
మరోవైపు బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. ఆమె సేలంలోని బస్టాప్లో రంగనాథన్తో ఉండగా గుర్తించారు. వారిద్దరిని పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే నిందితుడు తనను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని బాలిక పోలీసులకు తెలిపింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.
బాలిక చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పెయింటర్ రంగనాథన్ అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి.. 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. బాలికను కూడా పోలీసు అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ‘‘రంగనాథన్ వృత్తిరీత్యా పెయింటర్గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 5న బాలికను కిడ్నాప్ చేశాడు. బాలికను తీసుకుని సేలం వెళ్లాడు. అక్కడ ఒక ఆలయంలో బాలికను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వారిద్దరూ ఓ ఇంట్లోనే ఉంటున్నారని.. బాలికపై రంగనాథన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి’’ అని చెప్పారు.