Asianet News TeluguAsianet News Telugu

టీచర్‌తో ఆహారం పంచుకున్న విద్యార్థులు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

టీచర్ తో  విద్యార్థులు తాము తెచ్చుకున్న భోజనాన్ని షేర్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

 Students Share Tiffin Food With Teacher lns
Author
First Published Mar 24, 2024, 7:06 AM IST


న్యూఢిల్లీ: తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్ని  టీచర్ తో  పంచుకున్నారు చిన్నారులు. ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గామారింది.ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వెంటనే  వేలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేసిన తర్వాత ఈ వీడియోను సుమారు 10 మిలియన్ల మంది వీక్షించారు. 

అవినాష్ అనే నెటిజన్ ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.  కొందరు విద్యార్థులు తమతో తెచ్చుకున్న ఆహారాన్ని  టీచర్ కు అందిస్తున్న దృశ్యాలు  ఈ వీడియోలో ఉన్నాయి. విద్యార్థులు అందించిన ఆహారం తీసుకుంటూ టీచర్ వారికి ధన్యవాదాలు చెప్పారు.

టీచర్, విద్యార్థుల మధ్య ఆప్యాయతను తెలుపుతుందని  ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.చిన్నారులు  స్కూల్లో  భోజనం చేసేందుకు వీలుగా  బాక్సులను పంపారు వారి తల్లులు. ఓ రోటీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాక్సులో పెట్టారు ఓ తల్లి. మరో చిన్నారి బాక్సులో  కూరతో కలిపిన  ఆహారాన్ని బాక్సులో ఉంచారు. మరో బాక్సులో  పెరుగన్నం కలిపి పంపారు.

ఈ వీడియో చూసి ఓ నెటిజన్ ఇలా వ్యాఖ్యానించారు. తన గురువు తాను తీసుకెళ్లిన  మధ్యాహ్న భోజనం తిన్నప్పుడు తాను చాలా గర్వంగా భావించినట్టుగా  ఓ నెటిజన్ గుర్తు చేసుకున్నారు. తాను ప్రైమరీ టీచర్ కావడానికి కూడ కారణమిదేనని ఆ నెటిజన్ వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios