Asianet News TeluguAsianet News Telugu

లూథియానా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ: పలువురికి గాయాలు

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా సెంట్రల్ జైలులో గురువారం నాడు పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో పలువురు ఖైదీలు గాయపడ్డారు. ఖైదీల మధ్య ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు.

Several injured as clash breaks out at Ludhiana jail; cops fire in air
Author
Punjab, First Published Jun 27, 2019, 1:55 PM IST

లూథియానా:  పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా సెంట్రల్ జైలులో గురువారం నాడు పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో పలువురు ఖైదీలు గాయపడ్డారు. ఖైదీల మధ్య ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు.

జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకొందని  పోలీసులు తెలిపారు.  ఈ ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ, అధికారులు మాత్రం ఈ విషయాన్నిధృవీకరించలేదు.

డిప్యూటీ కమిషణర్ ప్రదీప్ కుమార్ అగర్వాల్  జైలు ప్రాంతానికి చేరుకొన్నారు.  ఈ ప్రాంతంలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనను అవకాశంగా తీసుకొని కొందరు ఖైదీలు తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కరిని పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios