లూథియానా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ: పలువురికి గాయాలు
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా సెంట్రల్ జైలులో గురువారం నాడు పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో పలువురు ఖైదీలు గాయపడ్డారు. ఖైదీల మధ్య ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు.
లూథియానా: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా సెంట్రల్ జైలులో గురువారం నాడు పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో పలువురు ఖైదీలు గాయపడ్డారు. ఖైదీల మధ్య ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు.
జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ, అధికారులు మాత్రం ఈ విషయాన్నిధృవీకరించలేదు.
డిప్యూటీ కమిషణర్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ జైలు ప్రాంతానికి చేరుకొన్నారు. ఈ ప్రాంతంలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనను అవకాశంగా తీసుకొని కొందరు ఖైదీలు తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కరిని పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకొన్నారు.