కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 9మంది మృతి..
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందారు. లారీ, జీపు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కర్ణాటక : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుమకూరు జిల్ల శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ-జీపు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 9మంది అక్కడికక్కడే మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బాధితులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.