Rajasthan :  రాజస్థాన్‌ అల్వార్ జిల్లాలోని తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ నెల‌16న ఓ  వంతెన కింద గోనె సంచిలో యువతి మృతదేహం కలకలం సృష్టించింది. ఈ కేసును చేధించిన పోలీసులకి విస్తుపోయే విషయాలు తెలిశాయి. 

Rajasthan : రాజ‌స్థాన్ లో ఓ హనీట్రాప్ ఘ‌ట‌న వెలుగులోనికి వ‌చ్చింది. అయితే.. అన్ని క‌థ‌ల్లా కాకుండా ఈ క‌ధ విషాదంతో ముగిసింది. ఓ యువ‌తి ఈజీ మ‌నీ కోసం త‌న అందాన్ని ఎర గా వాడుకుంది. డ‌బ్బున్న వ్య‌క్తుల‌ను టార్గెట్ చేసుకుని.. వారి ఇంట్లోకి ట్యూష‌న్ టీచ‌ర్ గా చేరేది.. పిల్ల‌ల తండ్రుల‌కు త‌న అందాల‌తో వ‌ల వేసేంది. త‌న మ‌త్తులో ప‌డ్డ త‌రువాత.. మెల్ల‌గా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగేది.. కానీ.. అన్ని ప‌రిస్థితులు మన‌కు అనుకూలంగా ఉండ‌వుగా.. ఎప్ప‌టిల్లాగానే.. డబ్బు కోసం ఓ వ్యాపారవేత్తకు వల వేసిన ట్రాప్ చేసింది. అనంత‌రం బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడంతో కుటుంబంతో కలిసి హత్య చేశారు.

వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌ అల్వార్ జిల్లాలోని తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ నెల‌16న ఓ వంతెన కింద గోనె సంచిలో యువతి మృతదేహం కలకలం సృష్టించింది. ఈ కేసును చేధించిన పోలీసులకి విస్తుపోయే విషయాలు తెలిశాయి. ప్రియాంక(29) అనే యువ‌తి.. ఢిల్లీ నుంచి రాజ‌స్థాన్ కు వ‌ల‌స వచ్చిందని తెలిసింది. ఆమె ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తుండడంతోపాటు స్థానిక వ్యాపారవేత్త కపిల్ గుప్తా ఇంటికి వెళ్లి పిల్లలకు ప్రైవేట్‌ పాఠాలు చెప్తుండేది. ఈ క్రమంలో ప్రియాంక త‌న అందచందాల‌తో ట్రాప్ చేసింది. త‌న చందంతో ఆయ‌న‌కు మ‌త్తెక్కించింది. ఇలా ఫిదా అయిన కపిల్‌.. ఆమెతో స్నేహం, ఆపై శారీర‌క సంబంధం వ‌ర‌కు వ‌చ్చింది.

‘కట్నం’ కోసం బ్లాక్‌మెయిలింగ్‌

ఇలా త‌రుచు క‌పిల్ ను త‌న మ‌త్తులోకి లాక్కునేంది. ఈ క్ర‌మంలో తనతో సంబంధాన్ని అడ్డుగా పెట్టుకుని.. కపిల్‌ను బ్లాక్‌మెయిలింగ్ చేసింది. త‌న‌కు తనకు పెళ్లి కుదిరిందని, రూ.50 లక్షలు కట్నం ఇవ్వాలని సదరు వ్యాపారవేత్తపై ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసింది

ఈ క్రమంలో ఆ యువ‌తి భరించలేకపోయిన కపిల్‌.. అసలు విషయం త‌న కుటుంబ సభ్యులు భార్యకి, తన బావమర్దులకు చెప్పాడు. ఈ క్ర‌మంలో ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు.. డబ్బు కోసం నమ్మి గుడ్డిగా వచ్చిన ప్రియాంక‌‌ని చంపేసి.. అనంత‌రం ఓ గోనె సంచిలో కుక్కి తాతర్‌పూర్‌ బ్రిడ్జి కింద పడేశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. సోమవారం కపిల్‌తో పాటు ఆయన భార్య, ఆమె ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రియాంక ఇదే తరహా హానీ ట్రాపింగ్‌తోనే ఎనిమిది మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రైవేట్‌ ట్యూషన్‌ పేరుతో ఇళ్లలోకి చేరి.. ఆపై పిల్లల తండ్రులకు వలపు గాలం వేసేదని, అటుపై వాళ్లను బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజేసి ఆ డబ్బుతో ఆమె జల్సాలు చేసేదని పోలీసులు నిర్ధారించుకున్నారు.