Asianet News TeluguAsianet News Telugu

కరోనా రూల్స్ బ్రేక్: వరుడి కుటుంబానికి రూ. 6 లక్షల ఫైన్

: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిబంధనలను కూడ పాటించడం లేదు. మరోవైపు కొందరు నిబంధనలు పాటించని వారిపై  జరిమానా విధిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ కుటుంబానికి రూ. 6 లక్షల జరిమానాను విధించారు కలెక్టర్.

Rajasthan  Man fined Rs 6.26 lakh after 15 guest test COVID-19 positive after attending his son's marriage
Author
Rajasthan, First Published Jun 28, 2020, 1:47 PM IST


జైపూర్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిబంధనలను కూడ పాటించడం లేదు. మరోవైపు కొందరు నిబంధనలు పాటించని వారిపై  జరిమానా విధిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ కుటుంబానికి రూ. 6 లక్షల జరిమానాను విధించారు కలెక్టర్.

రాజస్థాన్ బిల్వారా జిల్లాకు చెంందిన గీసులాల్ రాఠీ ఈ నెల 13వ తేదీన తన కొడుకు పెళ్లి జరిపించాడు. పెళ్లికి కేవలం 50 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలనే నిబంధన ఉంది.

అయితే ఈ నిబంధనలను ఖాతరు చేయలేదు. భారీ సంఖ్యలో పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం ఈ వేడుకకు హాజరైన వారిలో 15 మందికి కూడ కరోనా సోకింది. వీరిలో ఒకరు తీవ్ర అనారోగ్య లక్షణాలతో చనిపోయాడు. 

ఈ ఘటనకు కారణమైన గీసులాల్ రాఠీపై పోలీసులు ఈ నెల 22వ తేదీన కేసు నమోదు చేశారు.అంతేకాదు ఆ కుటుంబానికి రూ. 6 లక్షల 26 వేల 600 జరిమానా విధించారు. ఈ డబ్బులను సీఎం సహాయ నిధికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios