Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ పోర్టు ముందు నిర్దాక్షిణ్యంగా ఆటో టాక్సీ డ్రైవర్ ను కొట్టిన మహిళలు.. వైరల్ వీడియో

viral video: రాయ్‌పూర్ విమానాశ్రయం వెలుపల ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టిన కొంత మందితో  కూడిన మహిళల గుంపున‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఈ ఘటనపై రాయ్‌పూర్ నగరంలోని మనా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
 

Raipur : Women mercilessly hit the auto taxi driver in front of the airport.. Viral video
Author
First Published Sep 19, 2022, 5:04 PM IST

Raipur Airport: రాయ్‌పూర్ విమానాశ్రయం వెలుపల ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టిన మహిళల గుంపున‌కు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియోలో క‌నిపించిన దృశ్యాల్లో  కోపంతో ఉన్న ప‌లువురు మహిళలు డబ్బు వివాదంలో ఆ వ్యక్తిని  అత్యంత దారుణంగా బెల్ట్‌తో కొట్టడం.. పదేపదే చెంపదెబ్బలు కొట్టడం క‌నిపించింది. బాధితుడు అక్క‌డి నుంచి పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. వారు అత‌న్ని చొక్కాను లాగ‌డంతో చినిగి పోయింది. కాగా, ఈ ఘటనపై ఇరువర్గాలు రాయ్‌పూర్ నగరంలోని మనా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాయి.

 

కాగా,  ప‌లువురు మ‌హిళ‌ల‌తో కూడిన గుంపులో దాడికి గురైన వ్య‌క్తిని రాహుల్ ట్రావెల్స్ అనే ట్రావెల్ కంపెనీలో ఆటో ట్యాక్సీ డ్రైవర్ దినేష్ గా స్థానిక మీడియా సంస్థలు గుర్తించాయి. తాను ట్రావెల్ కంపెనీలో పని చేసేవాడిననీ, అయితే ఈ ఏడాది మే, జూన్ నెలల జీతాలు అందలేదని దినేష్ తన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బకాయి డబ్బులు వసూలు చేసేందుకు కంపెనీ కార్యాలయానికి రాగానే.. ఉద్యోగులు తనతో దురుసుగా ప్రవర్తించారనీ, వాగ్వాదానికి దిగారని ఆ వ్యక్తి చెప్పాడు. అతను మేనేజర్ నంబర్‌ను అడిగినప్పుడు, మహిళల గుంపు తనను దుర్భాషలాడుతూ.. కొట్ట‌డం ప్రారంభించింద‌ని చెప్పాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. త‌న‌పై దాడి చేసిన‌వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితుడు దినేష్ పోలీసుల‌ను కోరాడు. 

ఇదిలావుండగా, ఒక‌ టోల్ ప్లాజా వద్ద టోల్‌ ఫీజు చెల్లింపు అంశంలో ఇద్ద‌రు మ‌హిళ‌ల మ‌ధ్య గొడవ జరిగింది. ఈ క్ర‌మంలోనే ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నాసిక్‌లోని పింపాల్‌గావ్ టోల్ ప్లాజా వద్ద ఇద్దరు మహిళలు తీవ్ర ఘర్షణకు దిగినట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీరిలో ఒకరు టోల్ ప్లాజా ఉద్యోగి కాగా, మరొకరు ప్రయాణీకుడిగా కనిపించారు. వైర‌ల్ అవుతున్న వీడియ‌తోలో త‌మ జుట్ల‌ను ప‌ట్టుకుని మ‌హిళ‌లు గొడ‌వ‌ప‌డ్డారు. తిట్టుకున్నారు. వీరి మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ‌ను ఆప‌డానికి అక్క‌డున్న వారు ఆప‌డానికి ముందే వీరు ఇద్దరూ ఒకరి జుట్టును ఒకరు లాగుతూ.. ఒకరినొకరు చాలాసార్లు కొట్టుకోవడం కనిపించింది. "నాసిక్ సమీపంలోని పింపాల్‌గావ్ టోల్ బూత్‌లో మహిళల మధ్య భీకర పోరు చోటుచేసుకుందనీ, జుట్టుప‌ట్టుకుని ఒక‌రునొక‌రు దాడి చేసుకున్నార‌నీ.. ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది’’ అని ట్విట్టర్ లో ఆ వీడియోను పోస్ట్ చేశారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios