ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేడు జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. సోమవారం సాయంత్రం 5గంటలకు మోడీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడతారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి, వ్యాక్సిన్ల కొరత మీద ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేడు జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. సోమవారం సాయంత్రం 5గంటలకు మోడీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడతారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి, వ్యాక్సిన్ల కొరత మీద ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. 

వ్యాక్సిన్ విధానం, టీకాల కొరత మీద రాష్ట్రాలు, నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. దీనిమీద మోదీ ప్రధానంగా మాట్లాడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. టీకా ధరలు, వ్యాక్సిన్ పంపిణీ మీద ఇటీవల సుప్రీంకోర్టు కూడా కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇదిలా ఉండగా.. దేశంలో టీకాల కొరత తీర్చేందుకు విదేశీ టీకాల దిగుమతికి కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగానే విదేశీ టీకాలకు ఇటీవల మరిన్ని మినహాయింపులు కల్పించింది. ఏప్రిల్-మే నెలల్లో తీవ్రంగా విరుచుకుపడిన కరోనామహమ్మారి.. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుమఖం పట్టింది. 

అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్ డౌన్ లు, ఆంక్షలతో వైరస్ వ్యాప్తి కాస్త తగ్గింది. తాజాగా రోజువారీ కేసులు లక్షకు దిగొచ్చాయి. అయితే కేసులు తగ్గుముఖం పట్టినా వ్యాక్సిన్ పంపిణీ మాత్రం ఆశించినంత వేగంగా లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఉంటే మూడో దశ మరింత ఉద్ధృతంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.