పాపులర్ ఫ్రంట్ టెర్రరిస్టు కార్యకలాపాల కోసం ఇండియాలో, బయట డబ్బులు పోగు చేసిందని ఈడీ చెప్పింది.

ఢిల్లీ: పాపులర్ ఫ్రంట్ టెర్రరిస్టు పనుల కోసం ఇండియాలో, బయట దేశాల నుంచి డబ్బులు సేకరించిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. హవాలా ద్వారా, డొనేషన్ల రూపంలో డబ్బులు వచ్చాయి. పీఎఫ్ఐకి సంబంధించి ఇప్పటివరకు రూ.61.72 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. మనీలాండరింగ్ కేసులో ఎస్డీపీఐ జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీని అరెస్ట్ చేశాక ఈడీ ఈ విషయాలు చెప్పింది.

12 సార్లు నోటీసులు ఇచ్చినా ఫైజీ రాలేదని, అందుకే చర్యలు తీసుకున్నామని ఈడీ తెలిపింది. ఎస్డీపీఐ, పీఎఫ్ఐకి ఒకే లీడర్లు, కార్యకర్తలు ఉన్నారు. ఎస్డీపీఐ ఆర్థిక లావాదేవీలను పీఎఫ్ఐ కంట్రోల్ చేసింది. ఎస్డీపీఐ రోజువారీ పనులు, పాలసీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం, మీటింగులు అన్నీ పీఎఫ్ఐ చూసుకుంటుంది. ఎస్‌డీపీఐకి ఎన్నికల నిధిని పాపులర్ ఫ్రంట్ ఇస్తుంది. ఎస్‌డీపీఐకి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆధారాలున్నాయని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని ఈడీ తెలిపింది.

ఎస్డీపీఐ లోపల ఇస్లామిక్ సంస్థగా, బయటకు సామాజిక సంస్థగా పనిచేస్తుందని ఈడీ అంటోంది. దేశంలో దాడులు, టెర్రరిస్టు పనులు చేయడానికి గల్ఫ్ దేశాల నుంచి డబ్బులు సేకరించారు. రంజాన్ కలెక్షన్ పేరుతో లోకల్‌గా కూడా డబ్బులు పోగు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఎస్‌డీపీఐ జాతీయ అధ్యక్షుడిగా ఎంకే ఫైజీ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఈడీ చెబుతోంది.

పీఎఫ్ఐకి చెందిన 26 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఛైర్మన్, జనరల్ సెక్రటరీ, సభ్యులు ఉన్నారు. పటియాలా హౌస్ కోర్టు ఎంకే ఫైజీని ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది.