Vigilance Raids: ఒడిశాలోని సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్‌కు చెందిన 9 చోట్ల విజిలెన్స్ బృందం సోదాలు నిర్వహించింది.ఈ దాడిలో అతని నుండి కోట్లాది రూపాయలు, బంగారం, వెండి ఆభరణాలు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

Vigilance Raids: ఒడిశాలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ రౌత్‌ విజిలెన్స్ ఉచ్చులో చిక్కుకున్నాడు. ఏక కాలంలో నిందితుడికి సంబంధించిన 9 చోట్ల విజిలెన్స్ బృందం దాడులు చేసింది. ఈ క్రమంలో వారి నుంచి కోట్లాది రూపాయల డబ్బు,బంగారం, వెండి ఆభరణాలు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ కుమార్ రౌత్ .. నవరంగపూర్ అదనపు సబ్ కలెక్టర్. అతడి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో ఆస్తిని చూసి విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ బృందం కూడా ఆశ్చర్యపోయింది. విజిలెన్స్ ఉచ్చులో చిక్కుకున్న నవరంగపూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ రౌత్ అధికారిక నివాసంతో పాటు తొమ్మిది చోట్ల విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అసలు విషయం ఏమిటి?

సమాచారం ప్రకారం.. భువనేశ్వర్‌లోని కనన్ విహార్‌లో రెండంతస్తుల భవనం ఉంది. భువనేశ్వర్‌లోని ఓ ఇంట్లో ఆరు బాక్సుల నిండా నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు కొన్ని బంగారు బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలోని ఆయన అధికారిక నివాసం.. ఇంట్లో మొత్తం రూ.2.25 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాడి చేశారని సమాచారం అందుకున్న అతడు డబ్బు పెట్టెలను పక్కింటి టెర్రస్‌పైకి విసిరాడు. ఆ పెట్టెలో నిండా రూ.500 కట్టలు, వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో అధికారి పూర్వీకుల ఇంటిని కూడా డిపార్ట్‌మెంట్ టార్గెట్ చేసింది. నవరంగ్‌పూర్‌లోని ఇళ్లు, కార్యాలయ గదుల్లో దాడులు నిర్వహిస్తున్నారు. భద్రక్‌లోని బహుదర్దాలో ఉన్న అతని పూర్వీకుల ఇంటిపై కూడా విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఇంతకు ముందు కూడా.. ప్రశాంత్ కుమార్ రౌత్ సుందర్‌గఢ్ విస్రా బ్లాక్‌కి BDOగా ఉన్నప్పుడు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.