కామాంధులు కన్నుమిన్ను కానకుండా వ్యవహరిస్తున్నారు. ఒంటరిగా వెడుతున్న భార్యాభర్తలను బలవంతంగా పక్కనున్న తోటలోకి లాక్కెళ్లి.. భార్య మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త అడ్డు చెప్పకుండా అతన్ని చెట్టుకు కట్టేశారు.
ఉత్తర ప్రదేశ్ : Uttar Pradeshలోని ముజఫర్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి అతని భార్యపై Mass rapeనికి పాల్పడ్డారు కొందరు దుండగులు. బుధవారం రాత్రి ఈ అకృత్యం జరిగినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం భార్యతో కలిసి భర్త స్వగ్రామానికి కాలినడకన తిరిగి వస్తుండగా దారిలో 10మంది వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆ తరువాత వారిద్దరినీ సమీపంలోని మామిడి తోటల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు.
అక్కడికి వెళ్లిన తరువాత భర్తను చెట్టుకు కట్టేశారు. అనంతరం వారిలో నలుగురు బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. దీనిపై బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. వారిలో ఇద్దరుమైనర్లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఇలాంటి ఘటనే ఈ మార్చ్ 18న రాజస్థాన్ లో చోటు చేసుకుంది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.womanలపై లైంగిక దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ మార్పు కనిపించడం లేదు. మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఓ అమానవీయ ఘటన rajasthanలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో ఓ దళిత మహిళ.. తన భర్త, పిల్లలతో కలిసి పొలం నుండి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించి.. సదరు మహిళ husbandను తుపాకీతో కాల్చి చంపారు.
ఆ తర్వాత బాధితురాలిని ఆమె పిల్లలను gunతో బెదిరించి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారంతా బాధిత మహిళ గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. నిందితులను లాలూ ఠాగూర్, mohit thakor, సచిన్ ఠాకూర్ లుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పడం గమనార్హం.
ఇలాంటి ఘటనే 2020, డిసెంబర్ లో జార్ఖండ్ లో చోటు చేసుకుంది. జార్ఖండ్ లోని దుమ్మా జిల్లాలో భర్త కళ్లముందే ఓ మహిళపై 17 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. 17 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఘటన జరిగిన రోజు తన భర్తతో కలిసి బయటికి వెళ్లింది. పని ముగించుకుని భర్తతో పాటు ఇంటికి తిరుగుముఖం పట్టింది. అయితే, మార్గమధ్యంలో వారిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు.
భర్తపై దాడి చేసి అతన్ని నిర్బంధించారు. ఆ తర్వాత అతని కళ్ల ఎదుటే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళకు ఐదుగురు పిల్లలు ఉన్నారు.
