తాగి వేధిస్తున్నాడని.. సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య
ఆ కిరాయి హంతకులు ఆమె భర్త జయదీప్ గొంతుకు ఉచ్చు బిగించి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులకు ఆ మహిళపై అనుమానం కలిగి ఆమెను విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది.
తాగి వేధిస్తున్నాడని ఓ మహిళ కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఓ కిరాయి ముఠాకి రూ.50వేలు సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించింది. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రూ. 50 వేల రూపాయలకు సుపారీ కుదుర్చుకుని, భర్తను అత్యంత దారుణంగా హత్యచేయించింది. 35 ఏళ్ల ఆ మహిళ నాగపూర్లోని ఇద్దరు కిరాయి హంతకుల సాయంతో ఈ దారుణానికి పాల్పడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ మహిళ తన భర్తను హత్యచేసిన చందన్ నథూజీ దివెవార్, సునీల్ మాలవీయ్లకు రూ. 50 వేలు ఇచ్చింది.
ఈ కేసును ఛేధించిన పోలీసులు చందన్ను పట్టుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఆ కిరాయి హంతకులు ఆమె భర్త జయదీప్ గొంతుకు ఉచ్చు బిగించి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులకు ఆ మహిళపై అనుమానం కలిగి ఆమెను విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. అలాగే ఆ కిరాయి హంతకుల పేర్లు కూడా పోలీసులకు తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.