రాక్షసానందం... నిద్రపోతున్న పిల్లులను మంటల్లో వేసి..
చాలామంది కుక్కలను పెంచుకున్నట్లే పిల్లులను కూడా పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమగా... ఇంట్లో సభ్యునిగా ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం.. పిల్లులను దారుణంగా హింసించి రాక్షసానందం పొందాడు.
చాలామంది కుక్కలను పెంచుకున్నట్లే పిల్లులను కూడా పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమగా... ఇంట్లో సభ్యునిగా ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం.. పిల్లులను దారుణంగా హింసించి రాక్షసానందం పొందాడు.హాయిగా నిద్రిస్తున్న పిల్లుల్ని.. మంటల్లో వేసి రాక్షసానందం పొందాడో వ్యక్తి. ఈ దారుణం ముంబైలోని నయా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. భారతీ పార్క్ సమీపంలోని నయా నగర్కు చెందిన సిద్ధేశ్ పటేల్.. సోమవారం అర్ధరాత్రి స్థానిక అపార్ట్మెంట్లోకి వెళ్లాడు. అక్కడ నిద్రిస్తున్న పిల్లుల్ని చూసిన అతనిలో ఓ వింత ఆలోచన మెదిలింది. దీంతో వాటిని ఓ బాక్సులో వేసి నిప్పు పెట్టాడు. మంటలకు తాళలేక పరిగెడుతుంటే మళ్లీ వాటిని పట్టుకుని మంటల్లో వేశాడు. కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మంటల్లో కాలిపోతుంటే వికృతానందం పొందాడు.
అతను అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికి అపార్ట్మెంట్ వాసులు ఈ దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఆ పిల్లలు దాదాపు 60శాతం కాలిపోయి తీవ్రగాయాలపాలయ్యాయని వైద్యులు చెప్పారు. వాటికి చికిత్స అందిస్తున్నామని.. బతకడం కష్టమని చెప్పారు.