#Election Results 2019: తేలిపోయిన మహారాష్ట్ర, హర్యానా ఫలితాలు

Maharashtra and Haryana election results live updates

మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి గురువారం ఓట్ల లెక్కింపు పూర్తయింది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 3,237మంది అభ్యర్థులు... బ హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలిపోయింది.  

3:59 PM IST

తేలిపోయిన మహారాష్ట్ర,హర్యానా ఎన్నికల ఫలితాలు

మహారాష్ట్ర, హర్యానాల్లో ఈనెల 21వ తేదీన ముగిసిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇందులో మహారాష్ట్ర లో  ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అందుకోగా హర్యానాలో మాత్రం కాస్త తడబడింది.

2:09 PM IST

ఎర్నాకులంలో కాంగ్రెస్ గెలుపు

కేరళలోని ఎర్నాకులం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి టీకే వినోద్ 21 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

1:53 PM IST

కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఓటమి

హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓటమి పాలయ్యారు. ఖైతాల్ నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్ధి లీలా రామ్ చేతుల్లో 567 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
 

1:43 PM IST

ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు: శరద్ పవార్

ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును తాము గౌరవిస్తామన్నారు. ఎన్సీపీ ప్రదర్శనపై తాను సంతృప్తిగానే ఉన్నానన్నారు. 

1:38 PM IST

పుణేలో ఓట్ల లెక్కింపుపై ఎంఐఎం అభ్యంతరం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాగంగా పుణేలోని కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంఐఎం రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసింది. అప్పటి వరకు కేవలం 8 రౌండ్లు మాత్రమే ముగిశాయి. 
 

1:35 PM IST

గుజరాత్‌లో కాంగ్రెస్ 3, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యం

గుజరాత్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి
 

1:31 PM IST

సిక్కిం ఉపఎన్నికలో గెలిచిన సీఎం ప్రేమ్ సింగ్

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి, ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణులకు తెలిపారు.

1:19 PM IST

కిషన్‌గంజ్‌లో ఎంఐఎం అభ్యర్థి విజయం

బీహార్‌లోని కిషన్‌గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి హుడా దాదాపు 11 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్ధి స్వీటీ సింగ్‌పై విజయం సాధించారు. 
 

1:15 PM IST

హర్యానా బీజేపీ చీఫ్ రాజీనామా

హర్యానాలో హంగ్ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన రీతిలో ఫలితాలు రానందుకు నైతిక బాధ్యత వహిస్తూ సుభాష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

12:55 PM IST

కేరళలో సీపీఎం అభ్యర్ధి విజయం

కేరళలోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోని నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సీపీఎం అభ్యర్ధి విజయం సాధించారు. 

12:45 PM IST

రెజ్లర్ యోగేశ్వర్ దత్ వెనుకంజ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బరోడా నుంచి పోటీ చేసిన స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ 3,590 ఓట్ల వెనుకబడ్డారు. 

12:33 PM IST

పుదుచ్చేరి ఉపఎన్నికలు: కమల్‌రాజ్‌నగర్‌లో కాంగ్రెస్ పాగా

పుదుచ్చేరిలోని కమల్‌రాజ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. హస్తం పార్టీ అభ్యర్ధి జాన్ కుమార్.. ఏఐఎన్ఆర్‌సీ అభ్యర్థి ఎస్. భువనేశ్వరన్‌పై 7,170 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
 

12:31 PM IST

ఏ మాత్రం ప్రభావం చూపని మహారాష్ట్ర నవనిర్మాణ సేన

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 110 స్థానాల్లో బరిలో నిలిచిన ఎంఎన్ఎస్ కేవలం ఒకే ఒక్క స్థానంలో ముందంజలో నిలిచింది. 

12:19 PM IST

ఆదిత్య థాక్రేకు సీఎం పదవి..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు మేజిక్ ఫిగర్‌ను దాటేశాయి. అయితే గతంలో కంటే బీజేపీ సీట్లను కోల్పోయింది. అదే సమయంలో శివసేన మెరుగయ్యింది. దీంతో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటున్నారు శివసేన ఎంపీ సంజయ్ రావత్.

తాము బీజేపీతోనే కొనసాగుతామని అదే సమయంలో తమ డిమాండ్లను ఆ పార్టీ గౌరవించాలని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన యువనేత ఆదిత్య థాక్రేకు సీఎం పదవిని ఇవ్వాలని తాము బీజేపీని కోరుతామని సంజయ్ స్పష్టం చేశారు. వర్లీ నుంచి బరిలోకి దిగిన ఆదిత్య దాదాపు 12 వేల ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

12:14 PM IST

#Haryana: 23 వేల ఓట్ల ఆధిక్యంలో భూపిందర్ హుడా

హర్యానా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి భూపిందర్ సింగ్ హుడా 23,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.
 

11:54 AM IST

మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎంఐఎం దెబ్బ

మహారాష్ట్రలో అధికారాన్ని అందుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలపై ఎంఐఎం నీళ్లుచల్లింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పోటీ చేసినా సుమారు 40కి పైగా స్థానాల్లో ముస్లిం ఓట్లు భారీగా ఉన్నాయి. ఆ స్థానాల్లోనే బరిలోకి దిగిన ఎంఐఎం ఆ ఓట్లను చీల్చింది. దీంతో బీజేపీ-శివసేన అభ్యర్ధులు అక్కడ ముందంజలో నిలిచారు. 

11:52 AM IST

#Maharashtra: గతం కంటే తగ్గిన బీజేపీ సీట్లు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి భారీ ఆధిక్యం సాధించినప్పటికీ కమలనాథులకు సీట్లు గతంలో కంటే తగ్గాయి. ఇదే సమయంలో శివసేన బాగా మెరుగయ్యింది.  ఈ క్రమంలో సీఎం పదవి తమ పార్టీకే ఇవ్వాలని శివసేన ఎంపీ సంజయ్ రావత్ డిమాండ్ చేస్తున్నారు. 
 

11:41 AM IST

హర్యానాలో హంగ్: భూపిందర్ హుడాతో ఫోన్‌లో మాట్లాడిన సోనియా

హర్యానాలో హంగ్ పరిస్ధితులు ఏర్పడిన తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడి.. పరిస్ధితి సమీక్షించారు. 
 

11:29 AM IST

మహారాష్ట్ర: ఆరుగురు మంత్రులు వెనుకంజ

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆరుగురు మంత్రులు వెనుకబడ్డారు. వీరిలో పంకజా ముండే, రామ్ షిండే, అతుల్ సవే, విజయ్ శివత్రే, బాలా బేగ్డే, మదన్ యేరావార్ ఉన్నారు.

11:21 AM IST

విజయం దిశగా ఆదిత్య థాక్రే

థాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ఆథిత్య థాక్రే విజయం దిశగా దూసుకెళ్తున్నారు. వర్లీ నుంచి బరిలోకి దిగిన ఆయన ప్రస్తుతం 12 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 

11:19 AM IST

ఖట్టర్‌కు హైకమాండ్ నుంచి పిలుపు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ఖట్టర్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. పార్టీ అధినేత, హోంమంత్రి అమిత్ షా సైతం తన పర్యటనను రద్దు చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

11:04 AM IST

మాలేగావ్‌లో 5వేల ఓట్ల మెజార్టీలో ఎంఐఎం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఉనికిని చాటుతోంది. ఔరంగాబాద్ జిల్లాలోని మూడు స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. మాలేగావ్‌లో ఎంఐఎం అభ్యర్ధి సుమారు 5 వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

10:54 AM IST

14 వేల ఓట్ల ఆధిక్యంలో హర్యానా సీఎం

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 14 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కర్నాల్ నుంచి ఆయన బరిలో నిలిచారు. 
 

10:49 AM IST

కాంగ్రెస్-డీఎంకే అభ్యర్ధి

తమిళనాడులోని కామరాజ్ నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్-డీఎంకే అభ్యర్ధి జాన్ కుమార్ ముందంజలో ఉన్నారు. 

10:46 AM IST

ఆధిక్యంలో మంత్రి చంద్రకాంత్ పాటిల్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి చంద్రకాంత్ పాటిల్ 10 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:43 AM IST

18 ఓట్ల మెజార్టీతో అజిత్ పవార్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్ దూసుకెళ్తున్నారు. బారామతి నుంచి బరిలోకి దిగిన ఆయన సమీప బీజేపీ అభ్యర్ధి గోపిచంద్ పడాల్కర్‌పై 18 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:40 AM IST

వెనుకంజలో పంకజా ముండే

మాజీ కేంద్రమంత్రి గోపినాథ్ ముండే కుమార్తె పంకజా ముండే వెనుకంజలో నిలిచారు. పర్లీ నుంచి బరిలో నిలిచిన ఆమె సుమారు 4 వేల ఓట్ల వెనుకబడ్డారు.

10:33 AM IST

హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ పావులు

హర్యానాలో హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తుండటంతో బీజేపీ రంగంలోకి దిగింది. జేజేపీతో పాటు స్వతంత్రులను తమవైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 40, కాంగ్రెస్ 29, జేజేపీ 10, ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జేజేపీకి సీఎం పదవిని ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. 
 

10:28 AM IST

రాంపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఆధిక్యం

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ది ఫాతిమా ఆధిక్యంలో ఉన్నారు

10:25 AM IST

ఖచ్చితంగా గెలుస్తా: బబితా ఫొగాట్

ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తానన్నారు ప్రముఖ రెజ్లర్ బబితా కుమారి ఫొగాట్. హర్యానాలోని దాద్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఆమె ఫలితాల సరళిపై స్పందించారు. ఎన్నికల్లో గెలుస్తానని తనకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు సాధించడానికి నాలుగేళ్లు ఎదురుచూస్తామని.. ఇప్పుడు కూడా తనకు అలాగే అనిపిస్తుందని బబితా తెలిపారు. ప్రజలకు తనవైపున నిలిచారని.. వారి ఆశీర్వాదం తనపై ఎప్పుడూ ఉంటుందని అదే తన బలమన్నారు. 

10:16 AM IST

సుశీల్ కుమార్ షిండే కుమార్తె వెనుకంజ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె పరిణితీ షిండే వెనుకంజలో నిలిచారు. షోలాపూర్ సెంట్రల్ నుంచి ఆమె బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 
 

10:13 AM IST

వెనుకంజలో అభయ్ సింగ్ చౌతాలా

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా వెనుకంజలో ఉన్నారు. ఎల్లెనాబాద్‌ నుంచి ఆయన బరిలో నిలిచారు. 

10:11 AM IST

పంజాబ్ ఉపఎన్నికలు:

పంజాబ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3, శిరోమణి అకాలీ దళ్ 4 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.

10:08 AM IST

ముంబై, మరఠ్వాడలో దూసుకుపోతున్న బీజేపీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ+శివసేన కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. కొంకణ్ ప్రాంతంలో శివసేన, ముంబై, మరఠ్వాడ ప్రాంతంలో బీజేపీ+శివసేన కూటమి ముందంజలో ఉంది. అయితే ఉత్తర, పశ్చిమ మహారాష్ట్రల్లో ఎన్సీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. 

10:04 AM IST

#Maharashtra: రెండు స్థానాల్లో ఎంఐఎం ముందంజ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కూడా ఉనికిలోకి వచ్చింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్ధులు రెండింటిలోనూ ఆధిక్యంలోనూ కొనసాగుతున్నారు. 
 

9:55 AM IST

హర్యానాలో హంగ్ తప్పదా..?

భారతీయ జనతాపార్టీకీ హర్యానాలో గట్టిపోటీ ఎదురవుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. బీజేపీ 42, కాంగ్రెస్ 28, ఇతరులు 17 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్వతంత్రులు, ఐఎన్ఎల్డీ మద్ధతు తప్పనిసరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

9:52 AM IST

ఫడ్నవీస్‌తో మెజార్టీ దోబూచులాట

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎన్నికల ఫలితం దోబూచులాడుతోంది. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న ఆయన కౌంటింగ్‌లో పడుతూ.. లేస్తున్నారు. 

9:49 AM IST

సమస్తిపూర్‌లో ఎల్‌జేపీ ఆధిక్యం

బీహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్ధానానికి జరుగుతున్న కౌంటింగ్‌లో లోక్‌ జనశక్తి పార్టీ అభ్యర్ధి ప్రిన్స్ రాజ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 

9:45 AM IST

#Haryana: 9 వేల ఓట్ల ఆధిక్యంలో రంజిత్ సింగ్

మాజీ ఉప ప్రధాని దేవిలాల్ కుమారుడు రంజిత్ సింగ్ 9 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిర్సా జిల్లా రానియా నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచారు.
 

9:33 AM IST

#Maharashtra: మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన బీజేపీ-శివసేన కూటమి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ+శివసేన కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం 168 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ.. అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను దాటేశాయి. 

9:30 AM IST

దేవేంద్ర ఫడ్నవీస్ వెనుకంజ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్ నాగపూర్ సౌత్ వెస్ట్‌లో వెనుకంజలో ఉన్నారు. 


 

9:28 AM IST

#Maharashtra: 25 వేల ఓట్ల ఆధిక్యంలో ఆర్ఆర్ పాటిల్ సతీమణి

మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత ఆర్ఆర్.పాటిల్ సతీమణి సుమంతి పాటిల్ 25 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

9:22 AM IST

వెనుకంజలో హర్యానా బీజేపీ మంత్రులు

హర్యానా అసెంబ్లీ ఫలితాల్లో ఇద్దరు బీజేపీ మంత్రులు వెనుకబడ్డారు. సీనియర్ నేతలు ఓపీ ధన్‌కర్‌, నర్నాద్ నుంచి కెప్టెన్ అభిమాన్యు వెనుకంజలో ఉన్నారు. 
 

9:14 AM IST

కేరళ ఉపఎన్నికలు: యూడీఎఫ్‌ 4, ఎల్డీఎఫ్ ఒక్క స్థానంలో ఆధిక్యం

కేరళ ఉపఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 4, ఎల్డీఎఫ్ కూటమి ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

9:11 AM IST

హర్యానాలో బీజేపీ-కాంగ్రెస్ నువ్వానేనా

హర్యానాలో అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు నువ్వానేనా అన్న స్థాయిలో పోటీపడుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ 36, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 
 

9:01 AM IST

వెనుకంజలో టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్

టిక్ టాక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనాలీ ఫొగాట్ వెనుకంజలో ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమె అదంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. 
 

8:55 AM IST

మహారాష్ట్రలో 155 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

మహారాష్ట్రలో బీజేపీ+శివసేన కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ రెండు పార్టీలు 155 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
 

8:52 AM IST

హర్యానాలో 40 స్థానాల్లో బీజేపీ ముందంజ

హర్యానా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆ పార్టీ 40 స్థానాల్లో ముందంజలో నిలిచింది. 

8:50 AM IST

ఆధిక్యంలో రణదీప్ సింగ్

కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా ముందంజలో ఉన్నారు. ఖైతాల్ నుంచి ఆయన బరిలో నిలిచారు. 


 

8:48 AM IST

అశోక్ చవాన్ ముందంజ

మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ భోకార్ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నారు. 

8:47 AM IST

ఆధిక్యంలో క్రీడాకారులు

హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పలువురు క్రీడాకారులు బరిలో నిలిచారు. బరోడాలో యోగేశ్వర్ దత్, దాద్రీలో బబితా కుమారి ఆధిక్యంలో ఉన్నారు. 

8:38 AM IST

శరద్ పవార్ మనవడు రోహిత్ పవా‌ర్‌ వెనుకంజ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్‌ వెనుకంజలో ఉన్నారు. కర్జాత్ జామ్‌ఖేడ్‌‌ నుంచి రోహిత్ బరిలో నిలిచారు
 

8:29 AM IST

ఆధిక్యంలో బీజేపీ ముఖ్యమంత్రులు

హర్యానా, మహారాష్ట్రలలో బీజేపీ ముఖ్యమంత్రులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కర్నల్‌లో మనోహర్‌లాల్ ఖట్టర్, దక్షిణ నాగపూర్‌వెస్ట్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. అటు కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ హుడా గర్హీ-సంప్లా కిలోయ్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. 

8:24 AM IST

మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ ఆధిక్యం

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ దూసుకెళ్తోంది. మహారాష్ట్రలో 56, హర్యానాలో 11 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 16, హర్యానాలో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 

8:20 AM IST

వర్లీలో ఆదిత్య థాక్రే ముందంజ

గోరేగావ్, బోరివాలి, కోలాబాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. యువసేన అధినేత ఆదిత్య థాక్రే వర్లీలో ఆధిక్యంలో ఉన్నారు. థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 

8:14 AM IST

బీజేపీ 22, కాంగ్రెస్‌ 14 స్థానాల్లో ముందంజ

మహారాష్ట్రలో ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ కూటమి 22, కాంగ్రెస్ 14, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. 


 

8:09 AM IST

ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలతో పాటు దేశంలోని పలు చోట్ల జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా అన్ని ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. 


 

7:28 PM IST

దుశ్యంత్ చౌతాలా అదృష్టం ఎలా ఉందో

ఐఎన్ఎల్డి నుంచి ఓం ప్రకాష్ చౌతాలా తన పెద్ద కొడుకు అజయ్ సింగ్, ఇద్దరు మనవళ్లు దుశ్యంత్ సింగ్, దిగ్విజయ్ సింగ్ లను సస్పెండ్ చేయడంతో, గత డిసెంబర్ లో దుశ్యంత్ చౌతాలా తన సొంత పార్టీ జన నాయక్ జనతా పార్టీని నెలకొల్పాడు. ఈ సరి దుశ్యంత్ చౌతాలా స్వయంగా ఉచనా కలాన్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. 

7:26 PM IST

థాక్రే కుటుంబానికి ప్రత్యేకం

మహారాష్ట్ర ఎన్నికలు ఈ పర్యాయం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శివ సేన పార్టీ వ్యవస్థాపక కుటుంబం నుంచి తొలిసారి ఒక వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రస్తుత శివ సేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తనయుడు, బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే ఈ సరి బరిలో నిలిచారు. 

3:48 PM IST

గెలుపెవరిది: మహారాష్ట్ర, హర్యానా కౌంటింగ్.. లైవ్ అప్‌డేట్స్

మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి గురువారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

3:59 PM IST:

మహారాష్ట్ర, హర్యానాల్లో ఈనెల 21వ తేదీన ముగిసిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇందులో మహారాష్ట్ర లో  ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అందుకోగా హర్యానాలో మాత్రం కాస్త తడబడింది.

2:10 PM IST:

కేరళలోని ఎర్నాకులం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి టీకే వినోద్ 21 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

1:54 PM IST:

హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓటమి పాలయ్యారు. ఖైతాల్ నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్ధి లీలా రామ్ చేతుల్లో 567 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
 

1:43 PM IST:

ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును తాము గౌరవిస్తామన్నారు. ఎన్సీపీ ప్రదర్శనపై తాను సంతృప్తిగానే ఉన్నానన్నారు. 

1:38 PM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాగంగా పుణేలోని కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంఐఎం రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసింది. అప్పటి వరకు కేవలం 8 రౌండ్లు మాత్రమే ముగిశాయి. 
 

1:35 PM IST:

గుజరాత్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి
 

1:32 PM IST:

సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి, ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణులకు తెలిపారు.

1:20 PM IST:

బీహార్‌లోని కిషన్‌గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి హుడా దాదాపు 11 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్ధి స్వీటీ సింగ్‌పై విజయం సాధించారు. 
 

1:15 PM IST:

హర్యానాలో హంగ్ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన రీతిలో ఫలితాలు రానందుకు నైతిక బాధ్యత వహిస్తూ సుభాష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

12:55 PM IST:

కేరళలోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోని నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సీపీఎం అభ్యర్ధి విజయం సాధించారు. 

12:45 PM IST:

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బరోడా నుంచి పోటీ చేసిన స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ 3,590 ఓట్ల వెనుకబడ్డారు. 

12:33 PM IST:

పుదుచ్చేరిలోని కమల్‌రాజ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. హస్తం పార్టీ అభ్యర్ధి జాన్ కుమార్.. ఏఐఎన్ఆర్‌సీ అభ్యర్థి ఎస్. భువనేశ్వరన్‌పై 7,170 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
 

12:31 PM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 110 స్థానాల్లో బరిలో నిలిచిన ఎంఎన్ఎస్ కేవలం ఒకే ఒక్క స్థానంలో ముందంజలో నిలిచింది. 

12:19 PM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు మేజిక్ ఫిగర్‌ను దాటేశాయి. అయితే గతంలో కంటే బీజేపీ సీట్లను కోల్పోయింది. అదే సమయంలో శివసేన మెరుగయ్యింది. దీంతో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటున్నారు శివసేన ఎంపీ సంజయ్ రావత్.

తాము బీజేపీతోనే కొనసాగుతామని అదే సమయంలో తమ డిమాండ్లను ఆ పార్టీ గౌరవించాలని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన యువనేత ఆదిత్య థాక్రేకు సీఎం పదవిని ఇవ్వాలని తాము బీజేపీని కోరుతామని సంజయ్ స్పష్టం చేశారు. వర్లీ నుంచి బరిలోకి దిగిన ఆదిత్య దాదాపు 12 వేల ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

12:14 PM IST:

హర్యానా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి భూపిందర్ సింగ్ హుడా 23,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు.
 

11:55 AM IST:

మహారాష్ట్రలో అధికారాన్ని అందుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలపై ఎంఐఎం నీళ్లుచల్లింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పోటీ చేసినా సుమారు 40కి పైగా స్థానాల్లో ముస్లిం ఓట్లు భారీగా ఉన్నాయి. ఆ స్థానాల్లోనే బరిలోకి దిగిన ఎంఐఎం ఆ ఓట్లను చీల్చింది. దీంతో బీజేపీ-శివసేన అభ్యర్ధులు అక్కడ ముందంజలో నిలిచారు. 

11:52 AM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి భారీ ఆధిక్యం సాధించినప్పటికీ కమలనాథులకు సీట్లు గతంలో కంటే తగ్గాయి. ఇదే సమయంలో శివసేన బాగా మెరుగయ్యింది.  ఈ క్రమంలో సీఎం పదవి తమ పార్టీకే ఇవ్వాలని శివసేన ఎంపీ సంజయ్ రావత్ డిమాండ్ చేస్తున్నారు. 
 

11:41 AM IST:

హర్యానాలో హంగ్ పరిస్ధితులు ఏర్పడిన తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడి.. పరిస్ధితి సమీక్షించారు. 
 

11:29 AM IST:

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆరుగురు మంత్రులు వెనుకబడ్డారు. వీరిలో పంకజా ముండే, రామ్ షిండే, అతుల్ సవే, విజయ్ శివత్రే, బాలా బేగ్డే, మదన్ యేరావార్ ఉన్నారు.

11:22 AM IST:

థాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ఆథిత్య థాక్రే విజయం దిశగా దూసుకెళ్తున్నారు. వర్లీ నుంచి బరిలోకి దిగిన ఆయన ప్రస్తుతం 12 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 

11:19 AM IST:

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ఖట్టర్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. పార్టీ అధినేత, హోంమంత్రి అమిత్ షా సైతం తన పర్యటనను రద్దు చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

11:04 AM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఉనికిని చాటుతోంది. ఔరంగాబాద్ జిల్లాలోని మూడు స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. మాలేగావ్‌లో ఎంఐఎం అభ్యర్ధి సుమారు 5 వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

10:55 AM IST:

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 14 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కర్నాల్ నుంచి ఆయన బరిలో నిలిచారు. 
 

10:49 AM IST:

తమిళనాడులోని కామరాజ్ నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్-డీఎంకే అభ్యర్ధి జాన్ కుమార్ ముందంజలో ఉన్నారు. 

10:46 AM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి చంద్రకాంత్ పాటిల్ 10 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:43 AM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్ దూసుకెళ్తున్నారు. బారామతి నుంచి బరిలోకి దిగిన ఆయన సమీప బీజేపీ అభ్యర్ధి గోపిచంద్ పడాల్కర్‌పై 18 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:40 AM IST:

మాజీ కేంద్రమంత్రి గోపినాథ్ ముండే కుమార్తె పంకజా ముండే వెనుకంజలో నిలిచారు. పర్లీ నుంచి బరిలో నిలిచిన ఆమె సుమారు 4 వేల ఓట్ల వెనుకబడ్డారు.

10:33 AM IST:

హర్యానాలో హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తుండటంతో బీజేపీ రంగంలోకి దిగింది. జేజేపీతో పాటు స్వతంత్రులను తమవైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటి వరకు బీజేపీ 40, కాంగ్రెస్ 29, జేజేపీ 10, ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జేజేపీకి సీఎం పదవిని ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. 
 

10:28 AM IST:

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ది ఫాతిమా ఆధిక్యంలో ఉన్నారు

10:25 AM IST:

ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తానన్నారు ప్రముఖ రెజ్లర్ బబితా కుమారి ఫొగాట్. హర్యానాలోని దాద్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఆమె ఫలితాల సరళిపై స్పందించారు. ఎన్నికల్లో గెలుస్తానని తనకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు సాధించడానికి నాలుగేళ్లు ఎదురుచూస్తామని.. ఇప్పుడు కూడా తనకు అలాగే అనిపిస్తుందని బబితా తెలిపారు. ప్రజలకు తనవైపున నిలిచారని.. వారి ఆశీర్వాదం తనపై ఎప్పుడూ ఉంటుందని అదే తన బలమన్నారు. 

10:16 AM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె పరిణితీ షిండే వెనుకంజలో నిలిచారు. షోలాపూర్ సెంట్రల్ నుంచి ఆమె బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 
 

10:14 AM IST:

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా వెనుకంజలో ఉన్నారు. ఎల్లెనాబాద్‌ నుంచి ఆయన బరిలో నిలిచారు. 

10:11 AM IST:

పంజాబ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3, శిరోమణి అకాలీ దళ్ 4 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.

10:08 AM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ+శివసేన కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. కొంకణ్ ప్రాంతంలో శివసేన, ముంబై, మరఠ్వాడ ప్రాంతంలో బీజేపీ+శివసేన కూటమి ముందంజలో ఉంది. అయితే ఉత్తర, పశ్చిమ మహారాష్ట్రల్లో ఎన్సీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. 

10:04 AM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కూడా ఉనికిలోకి వచ్చింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్ధులు రెండింటిలోనూ ఆధిక్యంలోనూ కొనసాగుతున్నారు. 
 

9:55 AM IST:

భారతీయ జనతాపార్టీకీ హర్యానాలో గట్టిపోటీ ఎదురవుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. బీజేపీ 42, కాంగ్రెస్ 28, ఇతరులు 17 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్వతంత్రులు, ఐఎన్ఎల్డీ మద్ధతు తప్పనిసరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

9:52 AM IST:

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎన్నికల ఫలితం దోబూచులాడుతోంది. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న ఆయన కౌంటింగ్‌లో పడుతూ.. లేస్తున్నారు. 

9:49 AM IST:

బీహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్ధానానికి జరుగుతున్న కౌంటింగ్‌లో లోక్‌ జనశక్తి పార్టీ అభ్యర్ధి ప్రిన్స్ రాజ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 

9:45 AM IST:

మాజీ ఉప ప్రధాని దేవిలాల్ కుమారుడు రంజిత్ సింగ్ 9 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిర్సా జిల్లా రానియా నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచారు.
 

9:33 AM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ+శివసేన కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం 168 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ.. అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను దాటేశాయి. 

9:30 AM IST:

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్ నాగపూర్ సౌత్ వెస్ట్‌లో వెనుకంజలో ఉన్నారు. 


 

9:28 AM IST:

మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత ఆర్ఆర్.పాటిల్ సతీమణి సుమంతి పాటిల్ 25 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

9:23 AM IST:

హర్యానా అసెంబ్లీ ఫలితాల్లో ఇద్దరు బీజేపీ మంత్రులు వెనుకబడ్డారు. సీనియర్ నేతలు ఓపీ ధన్‌కర్‌, నర్నాద్ నుంచి కెప్టెన్ అభిమాన్యు వెనుకంజలో ఉన్నారు. 
 

9:14 AM IST:

కేరళ ఉపఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 4, ఎల్డీఎఫ్ కూటమి ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

9:11 AM IST:

హర్యానాలో అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు నువ్వానేనా అన్న స్థాయిలో పోటీపడుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ 36, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 
 

9:01 AM IST:

టిక్ టాక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనాలీ ఫొగాట్ వెనుకంజలో ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమె అదంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. 
 

8:55 AM IST:

మహారాష్ట్రలో బీజేపీ+శివసేన కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ రెండు పార్టీలు 155 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
 

8:52 AM IST:

హర్యానా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆ పార్టీ 40 స్థానాల్లో ముందంజలో నిలిచింది. 

8:50 AM IST:

కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా ముందంజలో ఉన్నారు. ఖైతాల్ నుంచి ఆయన బరిలో నిలిచారు. 


 

8:48 AM IST:

మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ భోకార్ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నారు. 

8:47 AM IST:

హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పలువురు క్రీడాకారులు బరిలో నిలిచారు. బరోడాలో యోగేశ్వర్ దత్, దాద్రీలో బబితా కుమారి ఆధిక్యంలో ఉన్నారు. 

8:38 AM IST:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్‌ వెనుకంజలో ఉన్నారు. కర్జాత్ జామ్‌ఖేడ్‌‌ నుంచి రోహిత్ బరిలో నిలిచారు
 

8:29 AM IST:

హర్యానా, మహారాష్ట్రలలో బీజేపీ ముఖ్యమంత్రులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కర్నల్‌లో మనోహర్‌లాల్ ఖట్టర్, దక్షిణ నాగపూర్‌వెస్ట్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. అటు కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ హుడా గర్హీ-సంప్లా కిలోయ్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. 

8:24 AM IST:

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ దూసుకెళ్తోంది. మహారాష్ట్రలో 56, హర్యానాలో 11 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 16, హర్యానాలో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 

8:20 AM IST:

గోరేగావ్, బోరివాలి, కోలాబాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. యువసేన అధినేత ఆదిత్య థాక్రే వర్లీలో ఆధిక్యంలో ఉన్నారు. థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 

8:14 AM IST:

మహారాష్ట్రలో ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ కూటమి 22, కాంగ్రెస్ 14, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. 


 

8:09 AM IST:

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలతో పాటు దేశంలోని పలు చోట్ల జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా అన్ని ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. 


 

7:28 PM IST:

ఐఎన్ఎల్డి నుంచి ఓం ప్రకాష్ చౌతాలా తన పెద్ద కొడుకు అజయ్ సింగ్, ఇద్దరు మనవళ్లు దుశ్యంత్ సింగ్, దిగ్విజయ్ సింగ్ లను సస్పెండ్ చేయడంతో, గత డిసెంబర్ లో దుశ్యంత్ చౌతాలా తన సొంత పార్టీ జన నాయక్ జనతా పార్టీని నెలకొల్పాడు. ఈ సరి దుశ్యంత్ చౌతాలా స్వయంగా ఉచనా కలాన్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. 

7:26 PM IST:

మహారాష్ట్ర ఎన్నికలు ఈ పర్యాయం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శివ సేన పార్టీ వ్యవస్థాపక కుటుంబం నుంచి తొలిసారి ఒక వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రస్తుత శివ సేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తనయుడు, బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే ఈ సరి బరిలో నిలిచారు. 

3:48 PM IST:

మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి గురువారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.