Asianet News TeluguAsianet News Telugu

కాలేజీ ఫ్రెండ్స్‌తో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం.. బిడ్డను ప్రసవించిన 11 రోజులకే హతమార్చిన భర్త

కర్ణాటకలో ఓ జంట ఏడాది క్రితం పెళ్లి చేసుకుంది. 11 రోజుల క్రితం పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. కానీ, భార్యపై భర్తకు తీరని అనుమానం. తన భార్య ఆమె కాలేజీ ఫ్రెండ్స్‌లో ఇద్దరు పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఆ అనుమానంతోనే ఆమెను వేధించాడు. చివరకు 230 కిలోమీటర్ల దూరంలో తల్లివద్ద ఉంటున్న భార్యను చేరి గది తలుపులు మూసి దుపట్టాతో గొంతు నులిమి చంపేశాడు.
 

karnataka man kills wife suspecting she has illicit affairs with her college friends kms
Author
First Published Nov 9, 2023, 8:23 PM IST

బెంగళూరు: కర్ణాటకలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమైంది. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. 11 రోజుల బిడ్డకు తల్లిని లేకుండా చేసింది. భార్య ఆమె కాలేజీ మిత్రులతో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. బిడ్డను ప్రసవించిన 11 రోజులకు 230 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఆమెను చంపేశాడు. ఆయన కూడా పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో సోమవారం చోటుచేసుకుంది.

32 ఏళ్ల కిశోర్ డీ కర్ణాటకలో పోలీసు కానిస్టేబుల్. ఆయన 2022 నవంబర్ 13వ తేదీన ప్రతిభను పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చింది. 11 రోజుల క్రితమే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి అయినప్పటి నుంచీ ప్రతిభ పై కిశోర్‌కు అనుమానాలు పెరుగుతూ వస్తున్నాయి. తరుచూ ఆమె ఫోన్ చెక్ చేసేవాడు. ప్రతి రోజూ ఆమె ఎవరితో మాట్లాడిందని సమాచారం తీసుకునేవాడు. ఆమెతో పాటు కాలేజీలో చదువుకున్న ఇద్దరు మగ పురుషులతో ఆమెకు అక్రమ సంబంధం ఉన్నదని అనుమానం పెట్టుకున్నాడు. ఆ అనుమానం దినదినం పెరుగుతూ వచ్చింది. ఆ అనుమానాలతోనే భార్యను వేధించడం కూడా ప్రారంభించాడు. 24 ఏళ్ల ప్రతిభ తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. ఇంతలో నెలలు నిండాయి.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి ఇంటి వద్దే రెస్టు తీసుకుంటూ ఉన్నది. వారి ఇంటి వద్ద ఉన్నప్పటికీ కిశోర్ అనుమానాల ప్రవాహం ఆగలేదు. అది మరింత ఉధృతమైంది. ఒక రోజు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాడు. అన్నీ అనుమానాలే. అక్రమ సంబంధం చుట్టూతే సంభాషణ జరిగింది. ఆమె మనసు బద్ధలైంది. పెళ్లై పట్టుమని ఏడాది గడిచిందో లేదో.. అనుమానాలతో మనసు చిత్రహింసలకు గురైంది. ఫోన్ పట్టుకునే ఆమె శోకం పెట్టుకుంది. వెక్కి వెక్కి ఏడ్చింది. తల్లి ఇది గమనించింది.

Also Read: KA Paul: పార్టీ గుర్తు ఇంకెప్పుడు కేటాయిస్తారు?: ఈసీపై కేఏ పాల్ ఆగ్రహం

వచ్చి బిడ్డను ఓదార్చింది. ప్రతిభ అలా రోధిస్తూ ఉంటే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెప్పింది. ఇప్పుడు ఆయన ఫోన్ మాట్లాడి బాధపడొద్దని, అసలు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయవద్దనీ బిడ్డకు సూచించింది. తల్లి మాటతో సాంత్వన పొందిన ప్రతిభ ఫోన్ ముఖం చూడలేదు.

సోమవారం ఉదయం ఫోన్ చూస్తే 150 మిస్డ్ కాల్స్. అన్నీ కిశోర్‌వే ఉన్నాయి. ఈ విషయాన్ని భయంతోనే తల్లికి చెప్పింది. దిగులు పడొద్దని తల్లి ఓదార్చింది. ఇక అటువైపున.. కిశోర్ డీ తన ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడంతో మరింత ఉక్రోశంతో ఉడికిపోయాడు. చామరాజ్ నగర్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో హోస్కోట్‌లోని అత్తగారింటికి బయల్దేరాడు. ఇంటికి వచ్చాక భార్య వద్దకు వెళ్లాడు. గది తలుపులు మూశాడు. ముందుగా ఆయన పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత దుపట్టాతో భార్య గొంతు చుట్టాడు. గొంతు నులిమి చంపేశాడు. 

ప్రతిభ తల్లి అనుమానంతో తలుపులు బాదుతూనే ఉండింది. సుమారు 15 నిమిషాలపాటు డోర్ తీయలేదు. ఆ తర్వాత కిశోర్ లోపలి నుంచి బయటికి వెర్రి కేకలు వేస్తూ వచ్చాడు. ఆమెను చంపేశాను.. నేను చంపేశాను.. అంటూ అక్కడి నుంచి పారిపోయాడు.

Follow Us:
Download App:
  • android
  • ios