Chennai: తమిళనాడులోని మధురైలో జల్లికట్టు ప్రారంభమైంది. మొత్తం 800 మంది జల్లుకట్టు క్రీడాకారులు పాలుపంచుకుంటున్నారు. జిల్లాలోని అవనియాపురం గ్రామంలో ఆదివారం జల్లికట్టు ప్రారంభమైందనీ,  మైదానంలో ఒకేసారి 25 మంది ఆటగాళ్లు మాత్రమే ఆడేందుకు అనుమతిస్తార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

Jallikattu: ప్రతి సంవత్సరం పొంగల్ పండుగ సందర్భంగా మధురై జిల్లాలో జ‌రిగే జల్లికట్టు ఉత్సవం ఆదివారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. అందుకు తగ్గట్టుగానే పొంగల్ పండుగ కావడంతో తొలి దశగా అవనియాపురంలో అన్ని ఏర్పాట్ల మ‌ధ్య జ‌ల్లుక‌ట్టు కొన‌సాగుతోంది. అవనియాపురంలో 320 మంది గోరక్షకులు ఉండ‌గా, మొత్తం 800 మందికి పైగా జ‌ల్లుక‌ట్టు క్రీడాకాల‌రులు పాలుపంచుకుంటున్నారు. "తమిళనాడులోని మధురైలో జల్లికట్టు ప్రారంభమైంది. మొత్తం 800 మంది క్రీడాకారులు పాలుపంచుకుంటున్నారు. జిల్లాలోని అవనియాపురం గ్రామంలో ఆదివారం జల్లికట్టు ప్రారంభమైందనీ, మైదానంలో ఒకేసారి 25 మంది ఆటగాళ్లు మాత్రమే ఆడేందుకు అనుమతిస్తార‌ని సంబంధిత వ‌ర్గాలు" తెలిపాయి.

Scroll to load tweet…

అవనియాపురం జ‌ల్లుక‌ట్టు ప్రారంభంలో గేటు వద్ద వేయి ఎద్దులు ముందుకు దూసుకుపోతున్నాయి. జల్లికట్టు పోటీలో బుల్ టామర్లకు, పట్టుబడని ఎద్దుల యజమానులకు సైకిల్, బీరో, బెడ్, బంగారు నాణేలతో పాటు పలు బహుమతులు అందించ‌డానికి ఏర్పాట్లు చేశారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న జ‌ల్లుక‌ట్టు పోటీల్లో ఎద్దుల‌ను ప‌ట్టుకోవ‌డానికి పాలుపంచుకున్న వారు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌దిమందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని స‌మాచారం. 

Scroll to load tweet…

"సుప్రీంకోర్టుతో పాటు తమిళనాడు ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలు పాటిస్తాం. అవనియపురంలో జ‌ల్లుక‌ట్టు నిర్వ‌హ‌ణ‌కు హైకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఒకేసారి 25 మంది ఆటగాళ్లు మాత్రమే ఆడతారు. 800 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని ఆశిస్తున్నాం" అని అనీష్ శేఖర్ తెలిపారు. కాగా, జల్లికట్టు పోటీల కోసం తమిళనాడు ప్రభుత్వం ఇటీవల విస్తృత మార్గదర్శకాలను నోటిఫై చేసింది.

Scroll to load tweet…


చిత్తూరులో 15 మందికి గాయాలు.. 

 ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఎద్దుల పందెం క్రీడ జల్లికట్టులో పాల్గొన్న 15 మంది గాయపడ్డారు. మకర సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా ఈ క్రీడను నిర్వహించారు. ఎంతో వైభవంగా జరుపుకున్న ఈ జ‌ల్లిక‌ట్టు క్రీడలో పలువురు ఉత్సాహవంతులైన యువకులు పాల్గొన్నారు.