భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-46 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-46 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ-46 557 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి ప్రవేశపెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

25 గంటల కౌంట్ డౌన్ ముగిసిన అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-46 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది.

అత్యంత ఆధునికమైన రాడార్ ఇమేజింగ్ భూ ఉపగ్రహమైన రీశాట్-2బీఆర్1 కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది.

అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తులో ఈ ఉపగ్రహం సాయపడనుంది. పీఎస్ఎల్వీ ప్రయోగాలతో ఇది 48వ ప్రయోగం.