Asianet News TeluguAsianet News Telugu

త్వరలో హైడ్రోజన్‌తో... రైళ్ళ పరుగులు: భారతీయ రైల్వే సరికొత్త ప్రయోగం

భారతీయ రైల్వే త్వరలో హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను మనదేశంలోనూ ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు జర్మనీ, పోలెండ్‌లలో మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. ఈ విధానంలో సౌరశక్తి ద్వారా నీటి విద్యుద్విశ్లేషణ చేయడం ద్వారా హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది.

Indian Railways to run trains on hydrogen fuel based technology ksp
Author
New Delhi, First Published Aug 8, 2021, 7:44 PM IST

ఆధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటున్న భారతీయ రైల్వే తాజాగా అతికొద్ది దేశాల్లో అమలులో ఉన్న హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను త్వరలో మనదేశంలోనూ ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు జర్మనీ, పోలెండ్‌లలో మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. ఈ విధానంలో సౌరశక్తి ద్వారా నీటి విద్యుద్విశ్లేషణ చేయడం ద్వారా హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది. కాలుష్య రహిత హరిత రవాణా విధానంగా దీన్ని చెప్పుకోవచ్చు.

హర్యానాలోని సోనిపట్‌ - జింద్‌ మార్గంలో 89 కిలోమీటర్ల మేర ఉత్తర రైల్వే నడిపే డెమో రైలుకు హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను వినియోగించనున్నట్లు రైల్వేశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 5లోపు బిడ్లను దాఖలు చేయాల్సిందిగా ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు ముందు ఆగస్టు 17న ఈ విధానంపై ఓ సదస్సు కూడా ఏర్పాటు చేసింది. ఈ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న రైళ్ల స్థానంలో ఈ విధానాన్ని ప్రవేశపెడతారు. దీనివల్ల ఒక్కో రైలుకు ఏటా రూ.2.3 కోట్ల విలువైన ఇంధనం ఆదా కావడమే కాకుండా.. కర్బన ఉద్గారాలు ఏటా 11.12 కిలో టన్నుల నుంచి 0.72 కిలో టన్నులకు తగ్గుతాయని ఇండియన్ రైల్వే వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios