Asianet News TeluguAsianet News Telugu

తేజస్‌లో విహరించిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

బెంగళూరులో జరుగుతున్ ఏరో ఇండియా షోలో తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ విహరించారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌ను ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు. 

Indian Army Chief General Bipin Rawat: Flight in LCA Tejas
Author
Bangalore, First Published Feb 21, 2019, 2:49 PM IST

బెంగళూరులో జరుగుతున్ ఏరో ఇండియా షోలో తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ విహరించారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌ను ఏరో ఇండియా-2019లో ప్రదర్శించారు.

దీనిలో భాగంగా మరో పైలట్‌తో కలిసి రావత్ ఇందులో ప్రయాణించారు. దీనిలో విహరించడానికి వీలుగా ఆయన శిక్షణ తీసుకున్నారు. ఈ యుద్ధవిమానం బుధవారం వాయుసేన అమ్ములపొదిలో అధికారికంగా చేరింది.

తేజస్‌కు సంబంధించిన పూర్తిస్ధాయి నిర్వహణ అనుమతి ధ్రువీకరణ పత్రాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) బుధవారం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అందజేసింది. యుద్ధాల్లో పాల్గొనేందుకు ఈ విమానం సిద్ధంగా ఉందని చెప్పేందుకు నిర్వహణ అనుమతిని జారీ చేస్తారు.

తేజస్‌ను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవడం, ఎలక్ట్రానిక్ యుద్ధ సూట్లతో పాటు పలు రకాల బాంబులు-ఆయుధాలను కలిగి ఉండటం దీని ప్రత్యేకతలు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios