Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం.. లాడ్జిలో విషం తాగి..

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది.  లాడ్జిలో గది తీసుకొని... అక్కడ విషయం తాగి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

illicit relation kills two people in tamilnadu
Author
Hyderabad, First Published Jun 28, 2019, 1:10 PM IST

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది.  లాడ్జిలో గది తీసుకొని... అక్కడ విషయం తాగి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని నెల్ లై జిల్లా పులియంకుడి కనకవినాయకర్ ఆలయ వీధికి చెందిన ఆనంద్ గణేష్(23) అనే వ్యక్తికి సుడలైనే మిత్రుడు ఉన్నాడు. వీరిద్దరూ తరచూ ఒకరింటికి మరొకరు వెళుతూ ఉండేవారు. ఈ క్రమంలో ఆనంద గణేష్ కి సుడలై భార్య రేవతి(25) తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

వారిద్దరి మధ్య బంధం ఇటీవల సుడలైకి తెలిసిపోయింది. దీంతో పెద్ద గొడవే అయ్యింది. ఈ క్రమంలో ఆనందగణేష్‌- రేవతి మంగళవారం ఇంటి నుంచి పారిపోయి కుట్రాలానికి వెళ్లారు. అక్కడ ఓ లాడ్జిలో గది తీసుకున్నారు. ఊరికి తిరిగి వస్తే అవమానమని ఇద్దరు విషం తాగారు. కాగా బుధవారం సాయంత్రం వరకు వారు ఉన్న గది తలుపులు తెరచుకోకపోవడంతో సందేహించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా గణేష్‌ మృతి చెంది ఉన్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న రేవతిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios