తీవ్రరూపం దాల్చిన సిత్రాంగ్ తుఫాను.. పశ్చిమ బెంగాల్లో ఆరెంజ్ అలర్ట్
West Bengal: బంగాళాఖాతంలో సిత్రంగ్ తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాన్ని సూచిస్తూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మధ్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
Cyclone Sitrang: సిత్రాంగ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో సిత్రాంగ్ తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాన్ని సూచిస్తూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మధ్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నందున అనవసరంగా బయటకు వెళ్లవద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిత్రాంగ్ తుఫాన్పై ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. అక్టోబరు 25న వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని.. అనవసరంగా బయటకు వెళ్లడం లేదా సుందర్బన్స్తో సహా సముద్ర ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఉత్తర, దక్షిణ 24 పరగణాల ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నాటికి గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సిత్రాంగ్ తుఫాను ఉత్తర-ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతున్నందున కోల్కతాతో సహా పశ్చిమ బెంగాల్లోని దక్షిణ జిల్లాలు తేలికపాటి నుంచి భారీ వర్షం కురస్తుందనీ, రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.
తీరం తాకిన సిత్రంగ్..
సిత్రాంగ్ తుఫాను సోమవారం అర్థరాత్రి బంగ్లాదేశ్లోని జనసాంద్రత కలిగిన లోతట్టు ప్రాంతంలో తన తీరాన్ని తాకింది. స్థానిక అధికారుల ప్రకారం.. ఈ క్రమంలో అక్కడ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. అయితే, దీనికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. సోమవారం రాత్రి 9:30 నుంచి 11:30 గంటల మధ్య పశ్చిమ బెంగాల్ తీరం దాటిన తర్వాత తుఫాను బంగ్లాదేశ్ తీరాన్ని బరిసాల్కు సమీపంలో దాటిందని వాతావరణ శాఖ తెలిపింది.
దీపావళి పండుగ సీజన్ను తగ్గించి, తుఫాను ఉత్తర బంగాళాఖాతం నుండి గంటకు 56 కిలో మీటర్ల వేగంతో బంగ్లాదేశ్ వైపు కదులుతుందనీ, దీని కారణంగా పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, తీరప్రాంత జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే, దక్షిణ బెంగాల్ తీర రేఖపై తుఫాను ప్రభావం ఊహించిన దాని కంటే చాలా తక్కువగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే, సోమవారం సాయంత్రం నుండి వర్షం ఆగిపోయింది. గాలి వేగం కూడా సాధారణమైనదిగా నమోదైంది. దక్షిణ బెంగాల్లోని ఉత్తర ప్రాంతాలు మంగళవారం ఉదయం వరకు తేలికపాటి వర్షంతో మేఘావృతమై ఉండవచ్చు. వాతావరణ శాఖ ప్రకారం, సిత్రాంగ్ తుఫాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం బంగ్లాదేశ్ లో 2.19 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎందుకంటే సిత్రాంగ్ తుఫాను దేశ నైరుతి తీరప్రాంతాలకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటిన తర్వాత సిత్రాంగ్ తుఫాను బారిసల్ సమీపంలో బంగ్లాదేశ్ తీరాన్ని దాటినట్లు ఐఎండీ మంగళవారం తెలిపింది.