Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2022: మోర్బీలో బీజేపీ అభ్యర్ధి కాంతిలాల్ ముందంజ

మోర్బీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి  కాంతిలాల్ అమృతీయ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఇటీవల కాలంలో వంతెన కూలిన ప్రమాదంలో  130 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Gujarat Election Result 2022 LIVE:BJP Leads In Morbi, Where 130 People Dies In Bridge Tragedy
Author
First Published Dec 8, 2022, 10:26 AM IST

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీ అసెంబ్లీ స్థానంలో  బీజేపీ అభ్యర్ధి  ఆధిక్యంలో  కొనసాగుతున్నారు.కచ్ పార్లమెంట్  స్థానం పరిధిలో  మోర్బీ అసెంబ్లీ స్థానం ఉంటుంది. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా కాంతిలాల్  అమృతీయ బరిలో నిలిచారు.ఇటీవల కాలంలో మోర్బీ తీగల వంతెన కూలిపోవడంతో సుమారు 130 మంది మరణించిన విషయం తెలిసిందే.  గుజరాత్  ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద స్థలాన్ని ప్రధాని పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా ఆయన పరామర్శించారు.ఈ  ప్రమాదంలో ఓ ఎంపీ కూడా తన కుటుంబ సభ్యులను కోల్పోయారు.

గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఫలితం వస్తుందోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 27 ఏళ్లుగా గుజరాత్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక, మొదటి విడతలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో సౌరాష్ట్ర, కచ్, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా మొత్తం 39 రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలిపాయి. 89 అసెంబ్లీ స్థానాల బరిలో మొత్తం 788 మంది అభ్యర్థులు నిలిచారు. మొదటి దశలో మొత్తం ఓటింగ్ శాతం 63.14గా నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.

also read:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2022: వడ్గాంలో వెనుకపడ్డ జిగ్నేష్ మేవానీ

మొదటి విడతలో బరిలో నిలిచిన ప్రముఖుల్లో  ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గాధ్వి- ఖంభాలియా నుంచి, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా(బీజేపీ)- జామ్‌నగర్ నార్త్ నుంచి,  బీజేపీ నేత కాంతిలాల్ అమృతియా- మోర్బి నుంచి,  మాజీ మంత్రి, బీజేపీ నేత పర్షోత్తమ్ సోలంకి - భావ్‌నగర్ రూరల్ నుంచి బరిలోఉన్నారు. 

ఇక, రెండో విడతలో అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్‌తో సహా మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 93 స్థానాల్లో పోలింగ్ జరిగింది. రెండో దశలోని మొత్తం 93 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలిపింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా మొత్తం 93 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ 90 స్థానాల్లో పోటీ చేయగా.. దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.  

ఈ దశలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (ఘట్లోడియా), పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ (విరాంగమ్), ఓబిసి నాయకుడు అల్పేష్ ఠాకోర్ (గాంధీనగర్ సౌత్), మాజీ మంత్రి శంకర్ చౌదరి (తారద్), జిగ్నేష్ మేవానీ (వడ్గం) ఉన్నారు. హార్దిక్ పటేల్,  అల్పేష్ ఠాకోర్, శంకర్ చౌదరిలు బీజేపీ  నుంచి పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి మేవానీ బరిలో ఉన్నారు. అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓటును వినియోగించుకున్నారు.  

గుజరాత్‌లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్‌, ఆప్‌లు కూడా బీజేపీకి గట్టి పోటీనిస్తున్నాయి. మోదీ బీజేపీ తరపున భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకుని గుజరాత్ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం నిర్వహించారు. ఆప్ అభ్యర్థుల తరపున కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios