Asianet News TeluguAsianet News Telugu

భూపేంద్ర పటేల్ : గుజరాత్ లో ప్రమాణ స్వీకారం చేసిన 24 మంది మంత్రులు

భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మందికి చోటు కల్పించారు. వీరిలో 10 మంది కేబినెట్ మంత్రులు, 14 మంది సహాయ మంత్రులు, సహాయ మంత్రుల్లో ఐదుగురు స్వతంత్ర హోదాగల మంత్రులు, వీరి చేత గవర్నర్ ఆచార్య దేవవ్రత్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.

Gujarat : Bhupendra Patel's 'Team 24' Sworn-in
Author
Hyderabad, First Published Sep 16, 2021, 3:07 PM IST

గుజరాత్ : ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంత్రివర్గంలోని మంత్రులకు ఈసారి చోటు దక్కలేదు. శాసనసభ మాజీ స్పీకర్ రాజేంద్ర త్రివేది, గుజరాత్ బీజేపీ మాజీ అధ్యక్షుడు జీతూ వఘానీలు నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలో 24 మందికి చోటు కల్పించారు. వీరిలో 10 మంది కేబినెట్ మంత్రులు, 14 మంది సహాయ మంత్రులు, సహాయ మంత్రుల్లో ఐదుగురు స్వతంత్ర హోదాగల మంత్రులు, వీరి చేత గవర్నర్ ఆచార్య దేవవ్రత్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విజయ్ రూపానీ కూడా పాల్గొన్నారు. 

నాకు వీర్య కణాలు తక్కువ, ఆ బిడ్డ నా బిడ్డకాదు.. కోర్టుకెక్కిన భర్త..!

భూపేంద్ర పటేల్ గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసినవారిలో.. రాజేంద్ర త్రివేది, జీతూ వఘానీ, హృషికేశ్ పటేల్, పూర్ణేష్ మోదీ, రాఘవ్‌జీ పటేల్,  కానూభాయ్ దేశాయ్, కిరీట్ సింహ్ రాణా, నరేష్ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్ సింహ్ చౌహాన్ ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios