Asianet News TeluguAsianet News Telugu

మెట్రో రైలులో మోదీ ప్రయాణం... దేవేంద్ర ఫడ్నవీస్ స్పెషల్ ట్వీట్..!

ఆ సమయంలో తాము ఏం మాట్లాడుకుంటున్నామో గెస్ చేసి చెప్పండి అంటూ ఫడ్నవీస్ ఆ ఫోటోకి క్యాప్షన్ పెట్టడం విశేషం.

Guess The Conversation": Devendra Fadnavis Tweets Metro Ride Pic With PM
Author
First Published Jan 20, 2023, 11:35 AM IST

ప్రధాని నరేంద్రమోదీ గురువారం ముంబయి నగరంలో కొత్తగా  మెట్రో రైలు సర్వీసును ప్రారంభించారు. అనంతరం ఆయన ఆ మెట్రో రైలులో ప్రయాణించారు. ఆయనతో పాటు... మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రయాణించడం గమనార్హం. వారు ముగ్గురు మెట్రోలో ప్రయాణిస్తున్న ఫోటోని దేవేంద్ర ఫడ్నవీస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఆ ఫోటోలో వారు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతున్నట్లుగా కనిపిస్తున్నారు. కాగా...  ఆ సమయంలో తాము ఏం మాట్లాడుకుంటున్నామో గెస్ చేసి చెప్పండి అంటూ ఫడ్నవీస్ ఆ ఫోటోకి క్యాప్షన్ పెట్టడం విశేషం. దీంతో... నెటిజన్లు కూడా ఈ ట్వీట్ కి రెస్పాండ్ అవుతున్నారు.

 

ఇదిలా ఉండగా... మెట్రోరైలులో ప్రయాణ సమయంలో ప్రధానమంత్రి మోదీ ప్రయాణికులు, మెట్రో రైలు ఉద్యోగులు, మహిళలతో కూడా సంభాషించారు.గుండావలి- మోగ్రా మెట్రో లైన్ 7 దశకు 2015వ సంవత్సరంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ మెట్రోరైలు ప్రాజెక్టును రూ.12,600 కోట్లతో నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios